పుట:Chandrika-Parinayamu.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చ. విని ప్రమదప్రవాహపరివేష్టితమానస చిత్రరేఖ యం
త నలమునీశుపాదనలినంబులకుం బ్రణమిల్లి యాఘనుం
డనుప హితాళిపాళియుతి నాస్థలి నల్లనఁ బాసి యాత్మకాం
చనమయకేళికానిలయసంస్థలిఁ జేరె రయంబు మించఁగన్. 124

ఉ. ఆలలితాంగి యొక్క భవికాహమునన్ “క్షణదోదయా”ఖ్య పాం
చాలవసుంధరాపతికి “శ్యామ” యనం బొగడొందు సుందరీ
మౌళియెడన్ జనించె, నలమానవభర్తయు భూరిహర్షభూ
షాకలితాత్ముఁడై యునిచె “చంద్రిక” యన్శుభనామ మింతికిన్. 125

మ. తనకార్యంబున కీగతిం జని యమర్త్యస్త్రీలలామంబు పా
వనమౌన్యుక్తి నిజాదివర్ణరహితత్వం బూని ధాత్రిం జనిం
చిన వార్తన్ విని చింత నొంది మదిఁ దత్స్నేహంబుతో దివ్యచి
హ్ననికాయంబులు గల్గఁ జేసె నవలా కబ్జాసనుం డెంతయున్. 126

ఉ. ఆసరసీరుహాక్షి కఖిలాద్భుతదాయివిపంచికాకలా
భ్యాస మొనర్పఁ జెంతఁ దగునట్టి ననుం “గుముదాఖ్యుఁ” గాంచి ప
ద్మాసనుఁ డంపఁ బూర్వసమయామితమైత్త్రి ధరిత్రిఁ జేరి యు
ద్భాసితతద్రహస్యగతిఁ దన్వికి నేర్పితి నేర్పు పెంపునన్. 127

తే. అంత నొకనాఁడు శారదాకాంతవలన
వింతరాగంబు లొకకొన్నివిని ముదమున
వాని నన్నింటి నారాజవర్యసుతకుఁ
దెలిపెద నటంచుఁ బుడమి కేతెంచు నపుడు. 128

సీ. కనుదోయి కింపూన్చు కలికికుంకుమబొట్టు
దార్చిననెమ్మోముఁదమ్మిదాని,
నీటుగాఁ దీర్చిన కాటుకరేఖచే
నొప్పారు విమలాక్షియుగముదాని,