పుట:Chandrika-Parinayamu.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నెమ్మెతోఁ గలయదే యీయూర్వశీవామ
హాళిమై జాబాలి యంతవాని,
నెనయవే వరుసతో నీవేల్పుచెలిచాలు
లలమండకర్ణజు నంతవాని,

తే. నిట్టి సురసుందరులు గల్గ నింతపనికి
మనములోఁ జాలఁ జింత నీవెనసె దేల?
వీరిలో నొక్కవెలఁది నమ్మారుఁ గూర్చి
పంచు మీకార్య మిపుడె ఫలించుఁగాని. 41

చ. అన నమృతంపుఁదేట జత యందిన యాసురరాజుమాట చ
య్యన శ్రుతిపర్వమై మదిని హర్షమహాపగఁ బొంగఁ జేయ , ‘నీ
పని కిది కార్యమౌర’ యని పల్కువెలందిమగండు కంతుఁ బి
ల్వ ననిలుఁ బంచి, వేల్పునవలాతలమిన్నల నంతఁ గాంచినన్. 42

సీ. వెలవెల నై తోఁచె నలచంద్రకళ యత్య
తులతమశ్శ్రీఁ బొందఁగలనె యనుచుఁ,
దల యెత్త లేదయ్యె నలరంభ ధీరకుం
జరము సెన్కిన మనఁజాల ననుచుఁ,
దెలివి వాయఁగఁ బొల్చె నలతార హంసుని
గొడవఁ బోయిన మహంబడఁగు ననుచు,
శ్యామలలో నీఁగె నలమాధవి ధరిత్రి
ఘనులగోసృతి నిల్వఁగలనె యనుచు,

తే. నిట్టు లనిమేషకాంత లహీనభంగ
వృత్తి సంధించి చలియింపఁ జిత్తమందు
వే యెఱిఁగి చిత్రరేఖ యన్వేల్పుచెలువ
నలువకు జొహారు గావించి నిలిచె నపుడు. 43