పుట:Chandamama 1948 01.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆమూటలో ఊంచి గంధర్వులు వెళ్ళిపొయారు.

అతను లేచేసరికి సాయంకాలమయింది. వెదురుగడ కిందికి వంగిఊంది. ఆకలి దహించుకు పోతూండటంవల్ల అతను ఆత్రంగామూట దించుకుని విప్పి చూసెసరికి పెట్టె కనిపించింది. అతను ఆశ్చర్యంతో దాని మూత తెరిచాడు. వెంటనే పెట్టెలోనుండీ యిద్దరు గంధర్వ స్తీలు బయటికి వచ్చి పంచభక్ష్య పరమాన్నాలతో అతని ముందు భొజనం ఉంచి తిరిగి పెట్టేలోకి వెల్లి మాయమయ్యాడు.

అతను భోజనం చేసి సంతోషంతో పెట్టెతీసుకుని యింటికి వెళ్ళిభార్యకు సంగతంతా చెప్పాడు. మర్నాడతను ఊళ్ళొ వాళ్లలందరినీ పిలిచి, పెట్టెసహాయంతో వచ్చినవారందరికీ షడ్రసోపేతంగా విందు చేసాడు. వచ్చినవారంతా పెట్టెను గురించి వింతగా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు.

తమ్ముడికి కలిగిన ఈ అదృష్టం గురించి భాగ్యవంతుడైన అన్నకు అసూయ కలిగింది. పెట్టె దొరికిన వృత్తాంతమంతా అన్న తమ్ముడివల్ల తెలుసుకొన్నాడు. భార్య ప్రోద్బలంవల్ల అటువంటి పెట్టె తానుకూడా సంపాదించుకు రావాలనుకున్నాడు. భార్యచేత మినపసున్ని ఉండలు చేయించుకుని తానుకూడా తమ్ముడు వెళ్ళిన దారినే బయలుదేరాడు.

వెళ్ళి వెళ్ళి ఇతనుకూడా చెరువు దగ్గిరికి చేరుకున్నాడు. వెదురు పొదకు మూట తగిలించి పడుకుని నిద్ర పోయినాడు.