పుట:Chandamama 1948 01.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

జానకి, వసంత అక్క చెల్లెళ్ళు. ఒకసారి బొమ్మల పండుగ వచ్చింది. అక్క చెల్లెళ్ళిద్దరూ బొమ్మలను వరసగా పెట్టసాగారు. ఇలా పెడుతుండగా మధ్యలో ఏబొమ్మ ఉండాలా అన్న సమస్య వచ్చింది. జానకి సరస్వతి బొమ్మ పెట్టాలంది. వసంత లక్ష్మి బొమ్మ పెట్టాలంది. దాని మీద ఇద్దరికీ తగువు వచ్చింది. "లక్ష్మి కంటే సరస్వతి మంచిది," అన్నది జానకి. "కాదు సరస్వతి కంటె లక్ష్మే మంచిది," అన్నది వసంత.