పుట:Chandamama 1947 07.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పోతున్నది. నేను ఏడుస్తూ అక్కడే నుంచున్నాను. అంతలో మా తాతయ్య ఏడుగుఱ్ఱాల బండిలో వస్తూ నన్ను చూచాడు.

"నాయనా ఎందుకోయి ఏడుస్తున్నావు? నాకు చెప్పవూ? నీకేమి తక్కువ," అన్నాడు.

"తాతయ్యా, నాలోని మంటలన్నీ ఆరిపోయాయి. వెలుతురంతా పోయింది. నాకన్నా చుక్కలే బాగున్నాయి. ఈ మాడుచెక్కముఖంతో మీఅందరిమధ్య ఎలావుండేది? తాతయ్యా, తాతయ్యా! నాకు కాస్త వెలుగివ్వవూ," అని జాలిగా అడిగాను.

తాతయ్య ఆలోచించి ఆలోచించి చివరికి అన్నాడు: "నువ్వుచాల పెద్దపొరపాటు చేశావురా. మీ అమ్మ యిచ్చిన అద్దం సరిగా వాడుకోలేక చెడిపోయావు. ఆ అద్దం పెట్టిచూస్తే ఎన్నిరంగులు కనిపించేవి! ఎంతప్రపంచం కనిపించేది? ఎన్నివిచిత్రాలు కనిపించేవి! సరే జరిగిందేదో జరిగింది. ఇకమీదనన్నా నేను చెప్పినట్టుచెయ్యి. నీ అద్దం ఉంది చాశావూ? దానిమీద ఎప్పుడూ నాకాంతి పడుతూ ఉండేటట్టుగా పట్టుకో. ఆ అద్దంమీది వెలుతురు నీ ముఖానికి తిప్పుకో. అప్పుడు నీముఖం తెల్లగా ఉంటుంది." అన్నాడు.

అప్పుడు నాకు ఎంత సంతోషం కలిగిందనుకొన్నారు. నాటినుంచి మా తాతయ్య చెప్పినట్టు చేస్తున్నాను. ఆయన వెలుగును నా అద్దంలోపట్టి నావైపుకు తిప్పుకుంటూవుంటాను. నాముఖం మళ్ళీ ప్రకాశించ మొదలుపెట్టింది. అయితే అప్పుడప్పుడు మాఅమ్మ నా అద్దానికి మా తాతయ్యకు అడ్డం వస్తుంది. అందువల్ల మీకు సరిగా వేళకు కనిపించలేక పోతున్నాను. అంతేగాని మరేమీ లేదు.