పుట:Chandamama 1947 07.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మనం మూడుసార్లు మహా సామ్రాజ్యం స్థాపించాము. మొదటిది ఆంధ్ర సామ్రాజ్యం, రెండోది కాకతీయ సామ్రాజ్యం, మూడోది విజయనగర సామ్రాజ్యం. ఈ మూడుసామ్రాజ్యాలు దక్షిణదేశానికి చేసినసేవ అంతాయింతాకాదు. వీటిని నెలకొల్పకుండా ఉన్నట్లయితే దక్షిణదేశచరిత్ర మరొక విధంగా ఉండేది.

ఈ సామ్రాజ్యాలను సమర్థతతో పరిపాలించినవారిలో స్త్రీలుకూడా ఉన్నారు. వారిలో రుద్రమ్మ ముఖ్యురాలు.

కాకతి గణపతిదేవ మహారాజుకు ఆడపిల్ల అయినా మగపిల్లవాడైనా రుద్రమ్మ ఒక్కతే. తండ్రి తరువాత రాజ్యం చేయవలసింది ఆమే. అందువల్ల గణపతిదేవుడు రాజుకు కావలసిన విద్యలన్నీ రుద్రమ్మకు చెప్పించసాగాడు. రుద్రమ్మ కత్తిసాము నేర్చింది. గుఱ్ఱపుస్వారి నేర్చింది. సేనలను నడప నేర్చింది. కోటలుపట్ట నేర్చింది. ఇంకా మంచిరాజుకు ఎన్ని విద్యలు కావాలో అన్నివిద్యలు నేర్చుకొంటూవుంది.

ఇదిమాత్రం తల్లి నారమ్మకు నచ్చలేదు. అప్పు డప్పుడు నారమ్మ భర్త గణపతిదేవునితో అంటూ వుండేది:- "ఆడపిల్లకు కత్తిసాములేమిటి, ఏ సంగీతమో, ఏ చిత్రకళో నేర్పించక. ఆడపిల్ల అన్న తరువాత ఆడపిల్లేకాని మగపిల్లవాడు అవుతుందా? ఇవ్వాళ కాకపోతే రేపైనా ఒకయ్యచేతిలో పెట్టవలసిందేగా!" గణపతీదేవుడు అతీపతీ చెప్పేవాడుకాదు. నవ్వి వూరుకునేవాడు.

రుద్రమ్మ సాముగరిడీలు నేర్చుకోవటం ఆమె చెలికత్తెలకు కూడా