పుట:Chandamama 1947 07.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాపేరుతో మానాన్న నవరసాలూ ఒప్పించేవాడు.

ఒక దసరా పండగనాడు నాకు అక్షరాభ్యాసం చేశారు. ఆ ముహూర్త బలిమిఏమోకాని నేను ఎప్పుడు పుస్తకం పట్టుకున్నా, అది నాచేతిలో తలకిందుగానే ఉండేది. "పుస్తకం సరిగా పట్టుకోరా, పశువా" అని మానాన్న మొట్టిన మొట్టికాయలూ, తిట్టినతిట్లూ, పెట్టిన తొడపాశాలూ ఇన్నన్నికావు.

"మొద్దు వెధవ! వెయ్యి పుఠాలు వేసినా వీడికి చదువురాదు. వెనకజన్మలో వీడు ఏ గాడిదో అయిఉండాలి," అని చెప్పేశాడుమానాన్న, వుసుగుపుట్టి.

అక్షరాభ్యాసం అయిన నాటినుంచీ నేను ఒక్క విద్యమాత్రం బాగానేర్చా. అదేమిటంటే దెబ్బలుతినటం. తోటి వాళ్లంతా నన్నే కొట్టేవాళ్లు; ఇరుగు పొరుగువాళ్లుకూడా, , తమపిల్లలకు తగల వలసిన దెబ్బలు నాకే తగించేవాళ్లు; పైగా మాయింటికివచ్చి, "మీ రాము డిట్లా చేశాడు" అని ఫిర్యాదు చేసేవాళ్లు. మానాన్న నన్ను చావకొట్టేవాడు; ఇక మా అమ్మకూడా నాలాంటి గాడిదను కని, ఊళ్లోవాళ్లచేతా మానాన్నచేతా దెబ్బలుపడటానికి వప్ప చెప్పినందుకు, కోపంవచ్చి నన్నే కొట్టేది. దీనికితోడు మానాన్నదగ్గిర నేను ఎనిమిది నెలలపాటు చదువుకున్నాను. అయిదు బళ్లూ నాకు వచ్చేలోగా ఎన్నిదెబ్బలు తినిఉంటానో మీరే ఊహించుకోండి. ఇలా దెబ్బలు తినడంవల్ల నావొల్లు బండబారి పోయింది. అందుకనేనేమో నాకు బండరాముడు అంటే ఇష్టం.

చిన్నతనంలో నాకు తెలివిగలపనులు చెయ్యాలని ఉండేది. మంచిపనులూ చెయ్యాలని ఉండేది. దెబ్బలు తినటం అలవాటయినకొద్దీ ఈ ఉద్దేశం అడు