పుట:Chandamama 1947 07.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనగా అనగా ఒక అడివిలో ఒక నక్క ఉండేది. అది చాలా జిత్తుల మారిది. అది ఎక్కడినించి వచ్చిందో, ఎప్పుడు వచ్చిందో ఎవరికి తెలియదు. దానితరహా అంతా చిత్రంగా ఉండేది. అందుకని మిగతా నక్కలన్నీ "నువు మా కులముదానివేకాదు పొ" మ్మన్నవి. దానితో మాట్లాడటంకూడా మానివేసినై.

ఇక నక్క ఏమిచేస్తుంది? అక్కడ తన ఆటలు సాగకపోయేవరకు అడవికి దగ్గరగా ఉన్న ఊరు పోయి అక్కడ మంగలివానితో స్నేహం చేసుకున్నది. పాపం, ఆ మంగలి చాలా మంచివాడు. అతనికి ఈనక్క సంగతి తెలియదు. పైగా నక్క చాలా పెద్దమనిషిలాగా తియ్యతియ్యగా మాట్లాడేది. అది నిజమని మంగలి నమ్మాడు.

వాళ్లిద్దరికీ మంచిస్నేహము కలిసింది. ఒకనాడు నక్క మంగలితో అన్నది కదా - "మంగలి మామా, మంగలి మామా! మనం పళ్లతోట వేసుకుంటే ఎట్లా ఉంటుంది? మనం తిన్నన్ని తినవచ్చు, మిగాతావి అమ్ముకుని పొదినిండా డబ్బులు పోసుకోవచ్చు."

పాపం మంగలికి ఈ మాటలు వినేవరకు నోరు వూరింది. మామిడి మొక్కలు, సపోటా మొక్కలు, అరిటి మొక్కలూ తెచ్చి తోటవేశాడు. అక్కడక్కడా గుమ్మడిపాదులూ, దోసపాదులూ పెట్టాడు. తనూ పెళ్లామూ కలిసి పాదులుచేసి, నీళ్ళు తెచ్చి చెట్లకు పోసేవాళ్ళు. నక్క పైన కర్రపెత్తనం చేస్తూ కావలి కాస్తున్నాననేది.

కొన్నాళ్లకు తోట కాపుకు వచ్చింది. నక్క