పుట:Chali Jvaramu.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ ప్రకరణము

35


గాని, నెత్తురు మానవుల దేహములో ప్రవహించు నప్పుడు, చంద్రవంక వలెనుండు మలేరియా పురుగులు పెరుగుటగాని, మార్పులను పొందుటగాని లేదని కూడ్ మెన్ సన్ కనిపెట్టెను. ఇట్లు వెలుపలకు తీయబడిన రక్తమునందు మాత్రమె వృద్ధిపొందు స్వభావము మలేరియాపురుగుల కుండుట వలన దాని ప్రయోజన మేమో కనిపెట్ట వలెనని అతడు ప్రయత్నించెను.

{{right|దోమకడుపులో మలేరియా పురుగులు

పెరుగుట రాన్ కనిపెట్టెను.}}

ఈతని దారిననుసరించి (Major Ross) మేజరు రాస్ అనునతడు 1895 సంవత్సరం మేనెల మొదలు చెన్నపట్టణములో ననేక సంవత్సరములు కృషిచేసెను. ఇతడు సాధారణముగ మన యిండ్లలోనుండు క్యూలెక్సు (Culex) అను ఒకానొక విధమయిన దోమలను పట్టుకొని చలిజ్వరపు రోగులమీద కరపించెను. అట్లు చలిజ్వరపురోగుల నెత్తురును త్రాగిన దోమలను పెంచి ఆ దోమలను మొదటి దినమున ఒకదానిని రెండవదినమున మఱి యొక దానిని మూడవ దినమున కొక్కకదానిని కోసి వానిలోపలి అవయవములను పరీక్షించెను. ఇట్టి పరీక్షవలన మలేరియా పురుగు దోమ కడుపులో వెలుపలికంటే మిక్కిలి వృద్ధిగ పిల్లలను