ఆమె రాజ్జీత్వం మనకోసం విజ్ఞాపనం చేయడమే అన్నాం. మనకు వరప్రసాదాలు ఆర్థించి పెట్టడమే అన్నాం. అంచేత ఆమె ప్రార్ధనంమీద మనకు నమ్మకం వుండాలి. అవసరాల్లో ఆ తల్లిని అడుగుకోవడం నేర్చుకోవాలి. నమ్మికతో ఆమెమీద భారంవేసి జీవించడానికి అలవాటుపడాలి. పన్నెండవ శతాబ్దంలోనే బెర్నార్దు భక్తుడు ఆమెనుద్దేశించి "తల్లీ! నీ శరణుజొచ్చి నీ సహాయమడిగి, నీ వేడుకోలును కోరుకున్న వాళ్ళల్లో నిరాశ చెందినవాడు ఒక్కడూలేడు" అని సవాలు చేసాడు. ఈ సవాలు మనకు ధైర్యాన్ని ఆశనూ కలిగించాలి. కనుక భక్తులు నమ్మకంతో ఆ తల్లిని శరణు వేడుతూండాలి.
7. వరప్రసాద మాత
15 శతాబ్దపు భక్తుడు సియన్నా బెర్నదీను మరియనుగూర్చి చెప్తూ"అన్ని వర ప్రసాదాలూ పితనుండి క్రీస్తుకూ, క్రీస్తునుండి మరియకూ, మరియనుండి శ్రీసభకూ లభిస్తాయి, కనుక అన్నివరప్రసాదాలూ మరియ అధీనంలో వుంటాయి. ఆ వరప్రసాదాలను ఆమె తన చిత్తం చొప్పున, తన కిష్టం వచ్చిన వాళ్ళకి, తనకు తోచినరీతిగా పంచిపెడుతూంటుంది" అని వ్రాసాడు. మరియ వర ప్రసాదాలమాత. ఇక్కడ ఈ విషయాన్ని గూర్చి మూడంశాలు చర్చిద్దాం.
1. వరప్రసాదాల మాత అంటే ఏమిటి
?
ప్రస్తుతం మన పొందేవరప్రసాదాలేవైనాసరే మరియమాతద్వారాగాని లభింపవు. క్రీస్తుద్వారాగాని పితదగ్గరకు వెళ్ళలేం. అలాగే మరియద్వారాగాని క్రీస్తు దగ్గరకు వెళ్ళలేం. క్రీస్తు మనకోసం పితను మనవిచేసినట్లే, ఆ తల్లి మనకోసం క్రీస్తును మనవిచేస్తుంది. ఈ భూమిమీద చరిస్తున్నపుడు ఆ తల్లి ఎలిసబేతును సందర్శించి స్నాపక యోహానునకు మేలుజేసింది — లూకా 1, 41. కానావూరిలో పెండ్లివాండ్ల అక్కర తీర్చింది - యోహా 2, 3. కల్వరికొండ మీద యేసు శిష్యులకు తాను తల్లిగా నిలిచింది - యోహా 19,2. యెరూషలేము మీదిగదిలో వుండి శిష్యులు ఆత్మను పొందాలని ప్రార్ధించింది - లూకా 1,14. ఈలా ఈ లోకంలో జీవించినపుడు క్రీస్తు శిష్యులను ఆదరిస్తూ వచ్చినతల్లి నేడు మోక్షంలో వుండిమాత్రం మనలను మరచిపోతుందా? పోదు. మనకోసం మనవి చేస్తుంది. వరప్రసాదాలను ఆర్థించి పెడుతుంది.
2. మరియు యెందుకు వరప్రసాదాల మాత?
మరియమాత ఏలా వరప్రసాదాల మాత ఐంది? ఆమె మన రక్షణంలో తోడ్పడిందన్నాం, రక్షణంద్వారా క్రీస్తు మన పాపాలను పరిహరించి వరప్రసాదాలను
24