పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/302

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3.అగస్టీను భక్తుడు "ఓ ప్రభూ! మా హృదయాన్ని నీ కొరకే చేసావు, నీయందు విశ్రమించిందాకా దానికి విశ్రాంతిలేదు" అని వాకొన్నాడు. ఇది మహవాక్యం. భగవంతుడు తనమిూదా, తన మోక్షంమీదా మన హృదయంలో సహజమైన కోర్మెను పెడతాడు. మనం ఈ లోకవస్తు వ్యామోహాల్లో తగుల్కొని ఆ కోరికను అణచివేసికోగూడదు. పునీతులకు మోక్షంమీద గాఢమైన వాంఛ ఉండేది. ఆ భాగ్యం మనకుకూడ అబ్బితే మన జీవితం ధన్యమౌతుంది.

4.అగస్టీను భక్తుడే మోక్షాన్ని గూర్చి చెపూ "అక్కడ మనం విశ్రాంతిని పొందుతాం. దేవన్షి దర్శిస్తాం, ప్రేమిస్తాం, స్తుతిస్తాం. అంతంలో అనంతంగా జరిగేది యిదే" అని వాకొన్నాడు. మోక్షంలో ఈలోకంలోలాగ కృషిచేయం. ఇక్కడ చేసిన కృషికి ఫలితంగా అక్కడ విశ్రాంతిని పొందుతాం. ఇంకా, అక్కడ దేవుణ్ణి దర్శించి ఆనందిస్తాం. భగవంతుణ్ణి దర్శించినవాళ్ళు అతన్ని ప్రేమించి స్తుతించకుండా ఉండలేరుకదా! మోక్షం మనకు గమ్యం. మనం పొరుగూరు వెళ్ళినపుడు మళ్ళా మనవూరికి తిరిగి పోవాలని ఉబలాటపడతాం. అలాగే మన గమ్యమైన మోక్షానికి తిరిగి పోవడానికి మనం సదా ఉబలాటపడుతూండాలి. మనం పరలోక పౌరులం -ఫిలి 3,20.

6.ఉత్ధానం

లోకాంతంలో మన మృతదేహం మళ్ళా ఉత్తానమై దేవుని సన్నిధిని చేరుతుంది. కనుక మనం దేహాన్ని గౌరవంతో చూడాలి. ఈ యధ్యాయంలో రెండంశాలు పరిశీలిద్దాం.

1.ఉత్దానాన్ని గూర్చిన బైబులు బోధలు

1. పూర్వవేదం మొదటలో ఉత్థానాన్ని గూర్చిస్పష్టంగా చెప్పదు. కాని దానియేలు గ్రంధాం, మక్కబీయుల గ్రంథాలు మొదలైన చివరి పుస్తకాల్లో ఈ భావం స్పష్టంగా కన్పిస్తుంది.

జీవానికీ మరణానికీ గూడ అధిపతి ప్రభువేనని చెపూ్త మొదటి సమూవేలు గ్రంధం