పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/300

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6.మెక్షంమీద కోర్కె నూత్న వేదంలో క్రీస్తు, పౌలు, పేత్రు మొదలైన వాళ్ళను పరిశీలిస్తే వాళ్ళకి మోక్షంమీద గాఢమైన కోర్కెఉందని తెలుస్తుంది. క్రీస్తు బోధల ప్రకారం, ఈ లోకంలో సత్కార్యాలు చేసినవాళ్లు ప్రపంచ ప్రారంభంనుండి సిద్ధమైయున్న రాజ్యాన్ని చేకొంటారు - మత్త 25,34. తండ్రి యింటిలో చాలానివాసాలున్నాయి. క్రీస్తు ముందుగా అక్కడికి పోయి శిష్యులకు ఓ నివాసస్థలాన్ని సిద్ధం చేస్తాడు - యోహా 142. ఈలా ఆ ప్రభువు తన శిష్యులు మోక్షంకొరకు ఉవ్విళ్ళూరాలని కోరాడు. ఇంకా అతడు స్వయంగా గూడ స్వర్గాన్ని ఆశించాడు. కనుకనే తండ్రినిచూచి నేనిపుడు నీవద్దకు వస్తున్నానని పల్కాడు – యోహాను 17, 13. ఆ తండ్రి తన్ను మహిమపరచాలని వేడుకొన్నాడు — 17,5.

పౌలుకి ఫిలిప్పి క్రైస్తవులంటే ఎంతో యిష్టం. వాళ్ళతో ఉండిపోయి వాళ్ళకు సేవలు చేయాలని అతని కోరిక. కాని అతనికి క్రీస్తంటే ఇంకా యొక్కువయిష్టం. కనుక తాను చనిపోయి క్రీస్తుని చేరుకోవడంమేలో, లేక బ్రతికివుండి ఫిలిప్పీయులకు సేవలు చేయడం మేలో అతనికే అర్థం కాలేదు. ఈరెండు కార్యాల్లో దేనిని ఎన్నుకోవాలో తనకే తెలియడంలేదన్నాడు. తన మటుకు తానైతే ఈ జీవితాన్ని త్యజించి క్రీస్తుని చేరుకోగోరుతున్నాని వాకొన్నాడు - ఫిలి 1,11-23. ఈ లోకంలో మనంభరించే చిన్నకష్టాలే మోక్షంలో మనకు అత్యధికమైన నిత్యమహిమను సంపాదించి పెడతాయి. కనుక మనం ఆ మోక్షాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కష్టాలనుభవించడానికి వెనుకాడకూడదని వాకొన్నాడు -2కొ4,17. ఈ జీవితంలో పౌలు చక్కగా పోరాడాడు. కనుక ప్రభువతనికి మోక్షంలో నీతిమంతుల కిరీటం దయచేస్తాడు. ఒక్క పౌలుకేగాదు, ఇక్కడ భక్తిగల జీవితం జీవించి ప్రభువు దర్శనం కొరకు ప్రేమతో వేచివుంటే వాళ్ళందరికి అలాంటి కిరీటమే లభిస్తుంది -2తిమో 4,7-8. పాలు మోక్షవాంఛ యిలాంటిది.

పేత్రు తననాటి క్రైస్తవ సంఘపాలకులను ప్రోత్సహిస్తూ "ఆ ప్రధాన కాపరి ప్రత్యక్షమైనపుడు విూరు ఎన్నటికిని క్షీణింపని మహిమాన్వితమైన కిరీటం పొందుతారు" అని చెప్పాడు – 1షేత్రు 5,4

ఈలా క్రీస్తూ, పౌలూ, పేత్రూ మొదలైన వాళ్లంతా మనం మోక్షంమిూద కోర్కె పెంచుకోవాలని సూచించారు. పూజారాధనలోని ప్రార్థనలుకూడ మనం యూలోక