పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/297

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్థాన ఆదివారం క్రీస్తుశిష్యులమీదికి శ్వాసనూది మీరు పవిత్రాత్మను పొందండి అని చెప్పాడు - యోహా 20,23. మోక్షంలో ఉత్థానక్రీస్తు భక్తులలోనికి తన ఆత్మను ఊదుతూంటాడు. ఇక్కడ మనం ఆత్మను పూర్తిగా పొందలేం. పరలోకంలో క్రీస్తునుండి ఆ యాత్మను సమృద్ధిగా పొందుతాం.

ఈ లోకంలో క్రీస్తుకి తండ్రిపట్ల గాధమైన ఆకర్షణం ఉండేది. అతడు నిరంతరము తండ్రికి ప్రీతిని కలిగించే కార్యమే చేసేవాడు - యోహా 8,29. అతనికి తండ్రిపట్ల ఈ యాకర్షణం ఎందుకుండేదంటే, ఆదిలో వాక్కు దేవునివద్ద ఉండేది - యోహా 1,1. ఆ వాక్కే తర్వాత క్రీస్తులోనికి ప్రవేశించి అతడు నిరంతరమూ తండ్రిని స్మరించుకొనేలా చేస్తుండేది. ఆ తండిని ప్రేమించి సేవించేలా చేస్తుండేది. మోక్షంలోగూడ ఉత్తానక్రీస్తు నిరంతరమూ తండ్రిచే ఆకర్షితుడౌతూంటాడు. ఇక, మోక్షంలో ఉత్తాన క్రీస్తుతో ఐక్యమయ్యే భక్తులుకూడ అతనిద్వారా తండ్రిని చూస్తారు. మోక్షమంటే ప్రధానంగా ముగురు దైవవ్యక్తులను దర్శించే తావు.

4. మోక్షానందం అందరికీ సరిసమానం కాదు

మోక్షంలో అందరూ దేవుణ్ణి దర్శించి ఆనందిస్తారు. అందరూ అతని వెలుగునుపొంది సంతోషిస్తారు. ఐనాఅక్కడ అందరి సంతోషమూ సమానంగా ఉండదు. ఈ లోకంలో మనం చేసికొనే పుణ్యంలో తారతమ్యాలుంటాయి. కనుక అక్కడ మనం భగవంతుణ్ణి దర్శించి ఆనందించే తీరులో కూడ తారతమ్యాలుంటాయి. అధిక పుణ్యంచేసికొన్నవాళ్లు ఎక్కువగాను, తక్కుపుణ్యం చేసికొన్నవాళ్ళు తక్కువగాను అతన్ని దర్శిస్తారు. పెద్ద కుండలో ఎక్కువ నీళ్ళు పడతాయి. చిన్నకుండలో తక్కువ నీళ్ళు పడతాయి. మన మోక్షానందం కూడ ఈలాగే ఉంటుంది

అసలు ఈ వ్యత్యాసం మోక్షంలో కాక భూమిమిూదనే ప్రారంభమౌతుంది, మనం ఈలోకంలో వున్నపుడు దేవునితో ఎంతగా సహకరించి కృషి చేస్తామో అంతగా పుణ్యాత్ములమౌతాం. కాని నరుల్లో కొందరు దేవునితో ఎక్కువగా సహకరిస్తారు, కొందరు తక్కువగా సహకరిస్తారు. దీనివల్లనే మనం మోక్షంలో ఎక్కువ మహిమకాని తక్కువ మహిమకాని పొందుతాం. మనం ఇక్కడచేసిన పుణ్యకార్యాలనే సామగ్రితోనే అక్కడ స్వర్గంలో మన సౌధాన్ని నిర్మించుకొంటాం. మన పుణ్యసామగ్రినిబట్టే మనస్వర్గధామం కూడ ఉంటుంది.
ఇంకో విషయంగూడ, మోక్షంలో మన శక్తికొలది దేవుణ్ణి దర్శిస్తాం, తెలిసికొంటాం. ఐనా మనం అతన్ని ఏనాటికీ పూర్తిగా గ్రహించలేం. నరులు అతన్ని