తేజస్సుకి ప్రతిబింబం - హెబ్రే 1,3. తబోరు కొండమీద అతని ముఖం సూర్యుళ్లా ప్రకాశించింది - మత్త 17,2. అతడు జగజ్యోతి - యోహా 8,12. పౌలు డమాస్కు త్రోవలో ఉత్థాన క్రీస్తుని జ్యోతినిగానే దర్శించాడు - అచ 26,13.
బైబులు తండ్రినీ క్రీస్తునీ ఈలా జ్యోతిర్మూర్తులనుగా పేర్కొనడం దేనికి? యూదుల భావాల ప్రకారం వెలుగు నరునికి ఆనందాన్నిస్తుంది. అతన్ని రక్షిస్తుంది కూడ. కనుక జ్యోతిర్మూర్తియైన భగవంతుడు నరుణ్ణి కాపాడేవాడూ, అతనికి సంతోషాన్ని దయచేసేవాడూను.
ఇక, భగవంతునికి వాసస్థలమైన స్వర్గంకూడ జ్యోతిర్మయమైందే. దర్శన గ్రంథం పరలోక యెరూషలేమను అనగా మోక్షాన్ని వర్ణిస్తూ ఈలా వాకొంది. "ఆ నగరంలో నాకు దేవాలయమెక్కడా కన్పించలేదు. సర్వశక్తిమంతుడు దేవుడూ ఐన ప్రభువూ, గొర్రెపిల్లా ఆ నగరానికి దేవాలయమౌతారు. ఆ పట్టణానికి సూర్యచంద్రుల వెలుగు అవసరం లేదు. దేవుని తేజస్సే ఆ నగరానికి వెలుగు, గొర్రెపిల్ల ఆ నగరానికి దీపం" - 21,22-23. ఈ వాక్యాల భావమేమిటి? యూదుల సంప్రదాయం ప్రకారం దేవాలయం అతి ముఖ్యమైంది. భక్తులు దేవుణ్ణి కలుసుకొనేది దేవళంలోనే. ఐనా ఈ వేదవాక్యం పరలోకంలో దేవళం అవసరంలేదని చెప్పంది. మోక్షంలో తండ్రి కుమారుడే మనకు దైవసాన్నిధ్యమౌతారు. అక్కడ యిూ లోకంలోలాగే సూర్యచంద్రుల వెలుగుగాని, దీపాల వెలుగుగాని ఉండదు. తండ్రీ ఉత్థానక్రీస్తూ అక్కడ వెలుగౌతారు. అనగా మోక్షం దేవుని తేజస్సుతో నిండి ఉంటుందని భావం. మోక్షానికి వెళ్ళినపుడు మనంకూడ ఆ తేజస్సులో పాల్గొంటాం. తండ్రి రాజ్యంలో నీతిమంతులు సూర్యునివలె ప్రకాశిస్తారని క్రీస్తే చెప్పాడు — మత్త 13.43. తండ్రి మనల్ని చీకటిలో నుండి అద్భుతమైన వెలుగులోనికి పిలుస్తాడు - 1షేత్రు 2,9, అది దేవుడు తన ప్రజలకు వారసభూమిగా యిచ్చే వెలుగు సామ్రాజ్యం - కోలో 2,12. ఈ వాక్యాలన్నిటినిబట్టి బైబులు మోక్షాన్ని వెలుగులోకంగా భావిస్తుందని అర్థంచేసికోవాలి.
3. మోక్షం దైవస్పర
స్పర్శ జీవితానికి సంబంధించింది. చిన్న బిడ్డలకేగాక పెద్దవాళ్ళకుగూడ స్పర్శ అవసరం. బాల్యంనుండి చనిపోయిందాకా గూడ మనందరికీ స్పర్శ అవసరమే. మనం ఒక వ్యక్తిని స్పృశ్ఠచినపుడు అతనిపట్ల మనకు ఆప్యాయతా ప్రేమా ఉందని తెలియజేస్తాం. ప్రేమతో గూడిన స్పర్శ ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. దేవుడుకి ఈ మర్మం తెలుసు, కనుక అతడుఓఅమ్మలానాన్నలామనలనుఆప్యాయంగాతాకుతుంటాడు.యిస్రాయేలు బాలుడై యుండగా నేనతన్ని ప్రేమించాను.