పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/270

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండూ సామూహికమైనవిగాని వ్యక్తిగతమైనవి కావు. కనుక మృతులకు సామూహికంగా తీర్పు జరగాలి గాని వ్యక్తిగతంగా తీర్పు జరగడమేమిటనుకొని తొలిరోజుల్లోనివాళ్ళ ప్రత్యేకతీర్పుని అనాదరం చేసారు. మూడవది, తొలినాటి క్రైస్తవులు ప్రభువు త్వరలోనే - తమ జీవితకాలంలోనే - రెండవమారు వేంచేసి వస్తాడని నమ్మారు, పౌలుకూడ మొదటలో ఈ భావానికి లొంగిపోయాడు. ఇక, యిూలా త్వరలోనే వేంచేసి వస్తాడనుకొన్న ప్రభువు అందరికీ కలిపి సాధారణ తీర్పు తీరుస్తాడు కదా! అందుచేత ప్రత్యేక తీర్చునుగూర్చి ఆలోచించే అవసరం తొలినాళ్ళలోని క్రైస్తవులకు కలుగలేదు.

కాని ఈ రెండవ రాకడ విషయంలో ఆలస్యం జరిగేకొద్దీ తొలినాటి క్రిస్తవ ప్రజలు ఆలోచించడం మొదలెట్టారు. నరుడు చచ్చిపోయినప్పడు ఏం జరుగుతుందా అనీ, దేవుడు వెంటనే న్యాయనిర్ణయం చేయడా అనీ ఊహలు ప్రారంభించారు. అంతలో వేదసాక్షులుగా మరణించినవాళ్లు చనిపోగానే మోక్షానికి వెళ్ళి దేవుణ్ణి దర్శిస్తారనే భావం ప్రచారంలోకి వచ్చింది. అనగా వాళ్ళకు చనిపోగానే న్యాయనిర్ణం - ప్రత్యేకతీర్పుజరిగిందన్నమాట. ఈ వేదసాక్షులకు జరిగే ప్రత్యేక తీర్పే మృతులైన కన్యలు, స్తుతీయులు, మామూలు విశ్వాసులు మొదలైన వాళ్ళందరికీ గూడ జరుగుతుందనే భావం క్రమేణ ప్రచారంలోకి వచ్చింది. ఈలా 13వ శతాబ్దానికల్లా ప్రత్యేకమైన తీర్పు ఒకటుందనే భావం బాగా వ్యాప్తిలోకి వచ్చింది. ఆ శతాబ్దంలోనే తిరుసభ ఈ వేదసత్యాన్ని అధికారపూర్వకంగా ప్రకటనచేసింది కూడ.

క్రైస్తవ విశ్వాసులు ఒకమారు ప్రత్యేక తీర్పుని గూర్చి తెలుసుకొన్నంక ఇక సాధారణ తీర్పుతో అవసరమేమిటా అని వితర్మించడం మొదలుపెట్టారు. సాధారణ తీర్పు ప్రత్యేకతీర్పుకి ఏమీ చేర్చదు. దానినుండి ఏమీ తొలగించదు. ప్రభువు అక్కడ చేసిన న్యాయనిర్ణయమే ఇక్కడ కూడ చెల్లుబాటవుతుంది. మరి మల్లా ఈ సాధారణ తీరపనేది ఎందుకు?

సాధారణ తీర్చుని సమర్ధిస్తూ వేదశాస్తులు కొన్ని కారణాలు చెప్పారు. మొదటిది, నరుల్లో ఒకరి పాపాలొకరికి వెల్లడి చేయడం కోసం, సాధారణతీర్పు జరిగిందాకా ఎవరు మంచివాల్లో ఎవరు చెడ్డవాల్లో లోకానికి తెలియదు, అంతవరకూ సజ్జనులూ దుర్మార్డులూ కలిసే జీవిస్తుంటారు. కాని ఈ తీర్పులో నిజానిజాలు వెల్లడి యాతాయి. కడకు సత్యం గెల్చి బహుమతిని పొందుతుంది. అసత్యం ఓడిపోయి శిక్షననుభవిస్తుంది. ఇది ప్రత్యేక తీర్పులో జరుగదు.

రెండవది, మన దేహంకూడ బహుమతినిగాని శిక్షను గాని పొందడంకోసం. ఆత్మ మంచిపనులు చేసినా చెడ్డపనులు చేసినా ఈ దేహంతో చేస్తుంది. కనుక బహుమతి 262