పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వుంది. మామూలుగా నరులందరూ అన్యాయానికి జంకుతూనే ఉంటారు. పాపంచేసే ప్రతి నరుణ్ణీ అతని అంతరాత్మ హెచ్చరిస్తూనే ఉంటుంది.

తీర్పుని గూర్చిన పై వేదసత్యంలో మూడంశాలు ఇమిడి వున్నాయి. మొదటిది, మనం చనిపొయేప్పుడే భగవంతుడు మన స్థితిని శాశ్వతంగా నిర్ణయిస్తాడు. అనగా చనిపోయినప్పడు దేవుడు మనలను పుణ్యాత్ములనుగా గణిస్తే ఇక శాశ్వతంగా పుణ్యాత్ములంగానే ఉండిపోతాం. పాపాత్ములనుగా గణిస్తే ఇక శాశ్వతంగా పాపాత్ములంగానే ఉండిపోతాం. ఈ స్థితికి ఇక మార్పంటూ ఉండదు. రెండవది, మన మరణకాలంలో మనం పుణ్యాత్ములమో పాపాత్ములమో దేవుడు మనకు స్పష్టంగా తెలియజేస్తాడు. ఆత్మ తన స్థితిని తాను స్పష్టంగా అర్ధం జేసికొంటుంది. ఈ విషయంలో అనుమానమంటూ ఉండదు. మూడవది, మన ఆత్మ తన పుణ్యపాపాల ఫలితాన్ని వెంటనే అనుభవించడం మొదలుపెడుతుంది. అనగా పాపపుటాత్మకు వెంటనే నరకశిక్షప్రాప్తిస్తుంది. పుణ్యపుటాత్మకు వెంటనేగాని, లేక ఉత్తరించే స్థలంలో శుద్ధిని పొందిన పిదపగాని, మోక్షభాగ్యం సిద్ధిస్తుంది. ఈ పుణ్యపాపాల ఫలితానుభవంలో జాప్యం అంటూ ఉండదు. ఈ మూడు సత్యాలనుగూడ మనం రూఢిగా నమ్మాలి.

2. ఎన్ని తీర్పులున్నాయి?

రెండు తీర్పులున్నాయని జ్ఞానోపదేశంలో నేర్చుకొంటూంటాం. అవి ప్రత్యేకతీర్పు, సాధారణ తీర్పులేక కడతీర్పు, భగవంతుడు ఒక్కో నరుడు చనిపోయిన వెంటనే అతనికి వ్యక్తిగతంగా తీర్చే తీర్పు ప్రత్యేకమైన తీర్పు. అతడు లోకాంతంలో అందరి యెదుటా అందరికీ కలిసి తీర్చే తీర్పు సాధారణతీర్పు లేక కడతీరు బైబులు విశేషంగా సాధారణ తీర్పుని పేర్కొంటుంది. ఐనా ప్రత్యేకమైన తీర్పుని గూర్చిగూడ కొన్ని సందర్భాల్లో చెప్పకపోదు. తొలి రోజుల్లోని పితృపాదులూ వేదాంతులూ సాధారణ తీర్పుని మాత్రమే పేర్కొన్నారు. 7వ శతాబ్దం తర్వాత గాని క్రైస్తవ వేదాంతులు ప్రత్యేక తీర్పుని గూర్చి మాట్లాడ్డం మొదలుపెట్టలేదు. కనుక క్రైస్తవ ప్రజలు తొలిరోజుల్లో సాధారణ తీర్పుని గూర్చి మాత్రమే మాట్లాడుతూ వచ్చారు. క్రమేణ ప్రత్యేక తీర్పుకూడ ఉందనే భావం ప్రచారంలోకి వచ్చింది. క్రైస్తవులు తొలి రోజుల్లో ప్రత్యేక తీరుపుని గూర్చి మాట్లాడకపోవడానికి కొన్ని కారణాలున్నాయి. మొదటిది, నరుడు దేహాత్మల సంయోగంవల్ల ఏకవ్యక్తిగా రూపొందుతాడని చెప్తుంది బైబులు. కాని ప్రత్యేక తీర్పులో దేహమనేది ఉండదు. కనుక నరుని వ్యక్తిత్వంలో సగం లోపించినట్లే, సగం వ్యక్తియైన నరునికి తీర్పు జరగడమేమిటని తొలినాటీ క్రైస్తవులు ప్రత్యేక తీర్పుని పట్టించుకోలేదు. రెండవది, యూద క్రైస్తవ మతాలు 261