రెండవది, చనిపోయేవాళ్ళ అనుభవాలు ఏలా ఉంటాయి అనే అంశం. శాస్త్రజ్ఞలు ఇంచుమించు చనిపోయి మళల బ్రతికిబయటపడ్డవాళ్ళ అనుభవాలనుకొన్నింటిని పరిశీలించారు, వాళ్ళ అనుభవాల ప్రకారం చనిపోయేవాళ్ళు ఓ జ్యోతిర్మూర్తిని కలుసుకొంటారు. అతడు చనిపోయేవాళ్ళను తన దగ్గరికి బలంగా ఆకర్షిస్తాడు. ఆప్యాయతతోను ఆదరాభిమానాలతోను తన దగ్గరికి రాబట్టుకొంటాడు. వాళ్ళని తన కాంతి ప్రవాహంలో మంచుతాడు. ఈ కాంతి యెంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఈ జ్యోతిర్మూర్తిని క్రీస్తునిగా భావించారు. యూదులు దేవదూతనుగా ఎంచారు.
ఇంకా, ఈ చనిపోయేవాళ్ళకు ఈ భౌతిక దశలో నుండి మరో దశలోనికి అడుగు పెడున్నట్లుగా కన్పిస్తుంది. ఆ నూత్నదశ ఈ ప్రస్తుత దశకంటె మెరుగైందని కూడ అనిపిస్తుంది. ఆ నూత్నదశలో ఇక్కడ లేని సౌందర్యమూ శాంతీ భద్రతా ప్రేమా ఉన్నట్లుగా స్ఫురిస్తుంది. కనుక చనిపోయేవాళ్లు ఆ నూత్నదశ నుండి మళ్ళా తమ ప్రాత జీవితానికి తిరిగిరావడానికి ఒప్పకోరు. వాళ్ళకు జీవించడం కంటె మరణించడమే మేలనిపిస్తుంది. ఈ భావాలనుబట్టిగూడ మృత్యువు భయపడదగింది కాదని అర్థం జేసికోవాలి. పైగా అది అంగీకరింపదగిందీ, ఆహ్వానింపదగిందీని. ప్రార్ధనా భావాలు
1. మనం మరణభయాన్ని తప్పక జయించాలి. మామూలుగా నరులంతా ਹ65 తల్లడిల్లిపోతారు. కాని యిది వట్టి అజ్ఞానం. మనం కొన్నాళ్ళపాటు ఈ లోకంలో జీవించగానే ఇక యీ ప్రపంచానికి అంటిపెట్టుకొంటాం. ఇక్కడి వస్తువులూ, సుఖభోగాలూ, వ్యక్తులూ మొదలైన వాళ్లమిూద వ్యామోహాలు పెంచుకొంటాం. కనుకనే ఈ ప్రపంచాన్ని వదలిపెట్టి పోవాలంటే మనకు అనిష్టంగాను బాధగాను భయంగాను ఉంటుంది. మనం ఈలోక వ్యామోహాలను ఎంతగా పెంచుకొంటామో మరణంకూడ అంత చేదుగా ఉంటుంది. ఆ వ్యామోహాలను ఎంతగా తగ్గించుకొంటామో చావుగూడ అంత తేలికగా ఉంటుంది. మృత్యుభయానికి స్వార్థం ప్రబలకారణం, విశ్వాసం నేర్పేదేమిటంటే, మన యీ లౌకిక జీవితం క్షణికమైంది. అది మనలను పరలోక జీవితానికి సిద్ధం జేయడానికి మాత్రమే ఉద్దేశిం పబడింది. మనకు ఇక్కడ స్థిరమైన పట్టం ఏమి లేదు. రాబోయే నగరం కోసం ఎదురుచూడాలి - హెబ్రే 13,14
2. క్రీస్తులోనికి చనిపోయి అతనితో ఉత్తానమౌతామనే నమ్మకమొక్కటే యథార్థంగా మృత్యుభయాన్ని జయించడానికి ఉపయోగపడేది. ఆ ప్రభువునందు మరణించినవాళ్ళకు జీవితం నాశంకాదు, క్రొత్తజీవితం ప్రారంభమౌతుంది. కనుక 259