పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కలిగించినా శాశ్వత జీవితం లభిస్తుందనే వాగ్దానం మాకు ఊరట నిస్తుంది. ప్రభూ! విూ విశ్వాసులకు ఈ జీవితం మారుతుందే కాని అంతం కాదు. ఈ భూలోక నివాసం శిథిలం కాగా మాకు పరలోక నిత్యనివాసం సిద్ధమౌతుంది". ఇది చాల గొప్ప భావం.

       విశ్వాసులు చనిపోయేప్పడు చెప్పే మరో ప్రార్ధనం ఇది, "సోదరా! (సోదరీ) మేము నీ యాత్మను సర్వశక్తిమంతుడైన దేవునికి అర్పిస్తున్నాం. నీయాత్మ మరల సృష్టికర్తను చేరునుగాక. నీవు పరలోకంలో సన్మనస్కులనూ వేదసాక్షులనూ స్తుతీయులనూ కలసికొందువుగాక. దేవదూత నిన్ను చల్లని చూపున జూచునుగాక. న్యాయాధిపతియైన యేసుక్రీస్తు నిన్ను అనుగ్రహించునుగాక. ప్రభువువైన యేసూ! నీవు కరుణతో ఈయాత్మను మోక్షంలో ప్రవేశపెట్టు.ఈ యాత్మ ప్రేమ ద్వారా నీతో ఐక్యమగునుగాక".
ఈ ప్రార్థనలో కొండంత నమ్మకం ఇమిడి ఉంది. మనం చావును జూచి భయపడకూడదు. తండ్రిలాంటి వాడైన దేవుణ్ణి నమ్మాలి, అంతే

.

5. ఆధునికుల భావాలు

     మరణాన్ని గూర్చి ఆధునిక వేదాంతులూ శాస్త్రజ్ఞలూ నూత్న భావాలు చాల సూచిస్తున్నారు. ప్రస్తుతానికివాటిల్లో రెండింటినిమాత్రం పేర్కొందాం. మొదటిది, చావులోమనకు స్వేచ్చ ఉంటుందా అనే అంశం. మరణకాలాన్ని ఎన్నుకొనే స్వేచ్చ మనకులేదు. దేవుడే ఆ గడియను నిర్ణయిస్తాడు. ఐనా మరణంలో మన స్వేచ్ఛ నశించదు. ఇహలోక జీవితంలో మనకు స్వేచ్ఛ ఉంది. పరలోక జీవితంలో గూడ స్వేచ్చ ఉంటుంది. మరణసమయంలో మాత్రమే ఆస్వేచ్చ ఎందుకు నశించాలి? చనిపోయేప్పుడు మనంపూర్ణ స్వేచ్చతో భగవంతుణ్ణి అంగీకరించనైనా అంగీకరిస్తాం. నిరాకరించనైనా నిరాకరిస్తాం. అతన్నిఅంగీకరించేవాళ్ళకి శాశ్వత బహుమతీ, నిరాకరించేవాళ్ళకి శాశ్వత శిక్షా ప్రాప్తిస్తాయి.
      కాని మనం ఏలా జీవిస్తామో అలాగే మరణిస్తాం. తమ జీవితకాలంలో భక్తివిశ్వాసాలతో జీవించినవాళ్ళు అవసానక్షణాల్లో గూడ ప్రభువుని ఎన్నుకొంటారు. అలా జీవించనివాళ్లు అంత్యక్షణాల్లో గూడ అతన్ని నిరాకరిస్తారు. నరుడు ఆఖరిక్షణాల్లో పరివర్తనం చెంది జీవితాన్ని మార్చుకోవడమనేది చాల అరుదు.
     ఒక్కోసారి జనులు ప్రమాదాల్లోను గండాల్లోను చిక్కి దిడీలున చనిపోతారు. కాని ఈలాంటి పరిస్థితుల్లో గూడ చావు ఒక్కనిమిషంలో సంభవింపదు. మనం మనిషి చనిపోయాడు అనుకొన్న తర్వాతగూడ అతడు కొంతకాలం బ్రతికేఉంటాడు. అతని మెదడులోని కణాలు చైతన్యవంతంగానే ఉంటాయి. అలా ఉన్నంతకాలం అతడు బ్రతికిఉన్నట్లే .నరులు ఎప్పుడుగూడ దిడీలన మరణించరు నిదానంగా మరణిస్తారు. కనుక ఏలాంటి మరణంలోనైనా సరే నరుడు స్వేచ్చగా భగవంతుణ్ణి ఎన్నుకోవడానికిగాని, నిరాకరించడానికిగాని వ్యవధిఉంటు೦ದಿ.