ఈ పుట అచ్చుదిద్దబడ్డది
పునీతం చేస్తుంది. కావున మృత్యువు మనలను ఓడించలేదు. ఆ ప్రభువు మనకు పునరుత్థానమూ జీవమూను. అతన్ని విశ్వసించేవాడు మరణించి గూడ మళ్ళా బ్రతుకుతాడు - యోహా 11:25.
ఒక్క మరణ సమయంలోనేగాదు, రోజువారి జీవితంలోగూడ క్రీస్తు మరణం మనవిూద సోకుతుంది. అలా సోకితేనేగాని మనకు ఆధ్యాత్మిక జీవనం లభించదు. మనం శారీరక జీవితం - అనగా పాపజీవితం జీవిస్తే తప్పక మరణిస్తాం. కాని పాపక్రియలను నాశంజేసే ఆధ్యాత్మిక జీవితం జీవిస్తే బ్రతుకుతాం - రోమా 8,43. కనుకనే పౌలు ప్రతిదినమూ శారీరక జీవితానికి చనిపోయేవాడు -1కొ 15,31. మనకుకూడ ఇదే నియమం వర్తిస్తుంది. మనం ఈలోకంలో జీవించినా ప్రభువు కొరకే జీవించాలి, మరణించినా ప్రభువుకొరకే మరణించాలి-రోమా 14,8. ఆ ప్రభువునందు కన్నుమూసే భక్తులు ధన్యులు - దర్శ 1413.
పౌలు ఈ జీవితాన్ని త్యజించి త్వరగా క్రీస్తుని చేరుకోవాలని ఉవ్విళ్ళూరిపోయాడు. మరణం తనకు లాభకరమని యెంచాడు - ఫిలి 1,21-23. ఇది చాల పవిత్రమైన కోర్కె ప్రభువుని అనుభవానికి తెచ్చుకొన్నవాళ్లు మరణానికి భయపడరు. దాన్ని మక్కువతో ఆహ్వానిస్తారు.
క్రీస్తు మరణింకిణీ గున మరణాన్ని తొలగించలేదు. నేడు మనంకూడ చావవలసిందే. ఐతే అతడు మున చావుని ఫలప్రదం చేసాడు. ఆ ప్రభువుని నమ్మి అతనియందు మరణించినపుడు అతని మరణం మన మరణంమిూద సోకి మనకు పాపపరిహారమూ వరప్రసాదమూ ఉత్థానమూ జీవమూ మోక్షభాగ్యమూ సంపాదించి పెడుతుంది. క్రీస్తు రాకముందు మరణం నరజాతికి పాపశిక్షగా ఉండేది. అతని మరణం తర్వాత అది మనకు పాపక్షమను దయచేసే సాధనమైంది. అమరత్వానికి ద్వారమైంది. అతని చలవవల్ల నేడు మనం చావు అనే వంతెనగుండా ఈ యిహలోకాన్నుండి దాటిపోయి శాశ్వతమైన మోక్షధామాన్నిచేరుకొంటాం. కనుక చావు మనకు నిరాశను గాక నమ్మకాన్ని కలిగించాలి. భయాన్నిగాక ధైర్యాన్ని పుట్టించాలి. క్రీస్తుమరణం మన మరణాన్ని పూర్తిగా మార్చివేసింది.
ఈ సందర్భంలోనే పునీతుల భావాలనుకూడ పరిశీలించాలి.మాములుగానే మనంచావంటే భయపడతాం. దాన్ని ఏలాగైనా తప్పించుకోజూస్తాం. కాని పునీతులు మరణాన్ని జూచి సంతోషించారు. దాని కోసం ఉవ్విళ్ళూరారు. దాన్ని ఆహ్వానించారు. పౌలు తన మరణం కోసం ఏలా ఆశతో ఎదురుచూచాడో పైన వివరించాం. ఇక నాల్గవ శతాబ్దానికి చెందిన గ్రెగోరీ నీసా భక్తుడు ఈలా వ్రాసాడు. “మనం చనిపోయినవాళ్ళ కొరకు గాక బ్రతికి వున్నవాళ్ళకొరకు శోకించాలి. ఎందుకంటే బ్రతికివున్నవాళ్ళ పరలోకప