పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"నా దేవా! నా ప్రభూ!” అంటాం. కాని ఆమె "నా కుమారా! నాదేవా! అనుకునేది. ఈలాంటితల్లి మరియ ఒక్కర్లే. కనుక ఆమెను ఎంతైనా స్తుతించాలి.

క్రీస్తు రక్షకుడు, మనం రక్షింపబడిన వాళ్ళం. ఈ రక్షణం ద్వారానే పరలోకంలోని పిత మనతండ్రి ఔతాడు. క్రీస్తు మన పెద్దన్న ఔతాడు. మరియమాత మానవుల తల్లి అవుతుంది. ఈ తల్లిని మనం స్తుతించి మహిమపరచాలి. ఆమె మహిమలన్నింటిలోను గొప్ప మహిమ దైవమాతృక గావడం. ఈ మాతృత్వాన్ని బట్టే స్త్రీ లందరిలోను మరియ ధన్యురాలు. సమస్త జాతులూ ఆమెను భాగ్యవతి అని కొనియాడతాయి. కొంతమంది భక్తులు దేవమాత వద్దనుండి నిత్యం. అవీ యివీ అడుగుకొంటూ వుంటారు గాని" ఆమె మహిమనూ, మాతృత్వాన్నీ స్మరించనే స్మరించరు. ఎవడో వొకడు నిత్యం మంగళ వార్తజపంలో రెండవభాగం మాత్రమే చెప్పకునేవాడట! ఈ జపంలో మొదటిభాగం మరియను స్తుతిస్తుంది. రెండవభాగం ఆయా మనవులను అడుగుకుంటుంది, అతడు మరియమాతనుండి మనవలు పొందితే చాలు, ఆమెను స్తుతించటం దేనికిలే అనుకున్నాడు, మన ప్రవర్తన ఈలా వుండకూడదు.

మరియమాత ఆనాడు లోకానికి క్రీస్తు నందించింది. ఈనాడు మనకూ ఆ క్రీస్తు నందించమని ఆ తల్లిని అడుగుకోవాలి. ఆమెను కొనియాడుతూ "నీ గర్భఫలం ఆశీర్వదింపబడునుగాక” అంటాం. మరియ అనే చెట్టు క్రీస్తు అనే మంచి పండును కాచింది. ఆ పండును సంపాదించుకొంటే మనమూ ధన్యులమౌతాం. కనుక ఆ పండుకోసం ఆ తల్లిని అడుగుకోవాలి.

భక్తుడు బెర్నారు జీవితంలో ఓ వృత్తాంతం. విన్పిస్తుంది. బెర్నారు మరియ భక్తుడు. ఓనాడు అతడు మరియు మాతమీద సుమ్మర్లు పడుతూ "నీవు నాపట్ల తల్లిలా మెలగడంలేదుకదా?" అన్నాట్ట. వెంటనే మరియ అతని మాటల తీరు సవరిస్తూ "నీవు మాత్రం నాపట్ల బిడ్డలా మెలుగుతున్నావా?" అని అడిగిందిట. మనంకూడ ఏబ్రాసిపనులు చేసినపుడెల్ల మరియమాతపట్ల బిడ్డల్లా మెలగడం మానివేస్తుంటాం. ఈ దౌర్భాగ్యానికి గురికాకుండా వుండాలని కూడ ఆ తల్లినే అడుగుకుందాం,

4.రక్షణమాత

రెండవ శతాబ్దపు భక్తుడు ఇరెనేయున్ "ఏవ అవిధేయురాలై చావు తెచ్చిపెట్టుకుంది. మనకూ చావు కలిగించింది. కాని మరియ దూతవాక్యానికి విధేయురాలై రక్షణం సంపాదించుకుంది. నరజాతి కంతటికీ రక్షణం ఆర్థించి పెట్టింది. ఏవ తన అవిధేయత వలన మనకు ఓ వురి తగిలించిపోయింది.మరియు తన విధేయత వలన ఆ

                                                                 15