పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్రీస్తు దర్శనం సౌలుకేగాని అతని అనుచరులకు గాదు. వాళ్లు సౌలుకి ఆధ్యాత్మికంగా ఏదో జరిగిందని గ్రహించారు. వాళ్ళకు క్రీస్తు స్వరం విన్పించిందికాని అతని వెలుగు మాత్రం కన్పించలేదు. ఈ గ్రంథం 22.9. ఈ యనుచరులు వెలుగును చూచారుకాని క్రీస్తు స్వరాన్ని వినలేదని చెప్తుంది. ఈలాంటి చిన్నచిన్న తేడాలను లూకా పెద్దగా పట్టించుకోలేదు.

క్రైస్తవులను హింసించాలనుకొని వచ్చిన సౌలు ఈ దర్శనంవల్ల నిస్సహాయుడై పోయాడు. దైవశక్తి ముందు మానవుల గొప్ప ఏపాటిది? అతడు పూర్తిగా గ్రుడ్డివాడై పోయాడు. నేలమీద వెల్లకిలబడివున్నాడు. అనుచరులే అతన్ని పైకిలేపి చేయిపట్టుకొని డమస్కు నగరానికి నడిపించుకొని పోవలసి వచ్చింది. ఆ దర్శనం ప్రభావం ఎంత తీవ్రమైందంటే సౌలు మూడురోజులవరకు అన్నపానీయాలు ముట్టుకోలేదు. భగవంతుడు నరులను తన సేవకు వినియోగించుకోక ముందు వారిని నిర్వీర్యులను చేస్తాడు.

డమస్కులోని క్రైస్తవ నాయకుల్లో ఒకడు అవనీయా, ప్రభువు అననీయాతో సాలను క్రైస్తవ సమాజంలోకి చేర్చుకొమ్మని చెప్పాడు. ఆ భక్తుడు విస్తుపోయాడు. సౌలు భయంకర వేదహింసకుడు కదా! పలిదగ్గరికి గొర్రెపిల్లనీ, డేగదగ్గరికి పావురాన్నీ పంపుతావా అని అతడు క్రీస్తుని అడిగాడు.

ప్రభువు అననీయాకు భయపడవద్దని చెప్పాడు. సౌలు పూర్తిగా మారిపోయాడని తెలియజేసాడు. అతడు పూర్వం క్రైస్తవులకు ఎంత అపకారం చేసాడో ఇపుడు వారికి అంత వుపకారం చేస్తాడని చెప్పాడు. సౌలు మొదట యూదులకు వేదబోధ చేస్తాడు. అటుపిమ్మట అన్యజాతి జనులైన గ్రీకు రోమను ప్రజలకు గూడ వేదబోధ చేస్తాడు. ఇప్పుడు మనం యూరప్ అని పిల్చే ప్రదేశంలో మొట్టమొదటిసారి క్రీస్తుని బోధించినవాడు పౌలే. అతని కృషివల్ల తిరుసభ కేవలం యూదులకే పరిమితంకాక అన్యజాతుల్లో కూడ వ్యాపించింది. సౌలు సామాన్య ప్రజలకు మాత్రమే కాక హెరోదు అగ్రిప్ప మొదలైన రాజులకీ, ఫిలిక్సు, ఫెస్టస్ మొదలైన గవర్నర్లకీ, స్థానిక అధికారులకీ క్రీస్తుని తెలియజేస్తాడు. ఇంకా, సౌలు ప్రభువు సేవలో ఎన్నో బాధలు అనుభవిస్తాడు. యెషయా ప్రవక్త పేర్కొన్న బాధామయ సేవకుళ్ళాగ క్రీస్తుకోసం శ్రమలు అనుభవిస్తాడు. ఈలాంటి సౌలుని క్రైస్తవ సమాజంలో చేర్చుకోవడానికి అననీయా ఏమాత్రం వెనుకాడకూడదని క్రీస్తు తెలియజేసాడు.

సౌలుకి అద్భుతంగా దర్శనమిచ్చిన ప్రభువు అతన్ని నేరుగా క్రైస్తవ సమాజంలో చేర్చుకోవచ్చుకదా! కాని క్రీస్తు అలా చేయలేదు. ఆనాటి క్రైస్తవ పెద్దలద్వారానే అతడు