పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3. ప్రార్ధనా భావాలు

1. ఈ యధ్యాయంలో ముఖ్యాంశం ఏలీయా మోక్షారోపణం కాదు. ఎలీషా గురువుకి వారసుడు కావడం ఇక్కడ ముఖ్యాంశం, నిజమైన ప్రవక్త మరో ప్రవక్తకు వారసుడైనా అయియుండాలి. లేదా దేవుడే అతన్ని స్వయంగా ఎన్నుకొనైనా వుండాలి, ఇక్కడ ఎలీషా గురువుకి వారసుడు అన్న విషయాన్ని తెలియజేసాడు రచయిత. కనుక అతడు నిజమైన ప్రవక్త ప్రవక్తలపట్లా వారి బోధలపట్లా మనకు అపార గౌరవం వండాలి. వాళ్ళు పవిత్రాత్మచే ప్రేరితులై దేవుని సందేశాన్ని విన్పించారు - 2షేత్రు 121. ఆ సందేశాన్నే ఇప్పడు బైబుల్లో మనకొరకు పదిలపరచి వుంచారు. కనుక బైబుల్లోని ప్రవక్తల వాక్యాలు మనకు శిరోధార్యాలు. మనం వాటిని భక్తితో మననం చేసికోవాలి.

2. ఏలీయా కూడ అందరిలాగే మరణించాడు. ఏలా మరణించాడో మనకు తెలియదు. ప్రభువుకి అతని మరణం మీద సంపూర్ణాధికారం వుంది. జనన మరణాలకు అతడు కర్త కదా! కనుక అతడు ప్రవక్తను తన కిష్టమొచ్చిన రీతిలో మరణింపనిచ్చాడు. ఆ మరణంద్వారా అతన్ని తన దగ్గరకు పిల్చుకొన్నాడు. చావుద్వారా అతనికి నిత్యజీవమిచ్చాడు. యేలీయా బ్రతికివుండగా ప్రభువు ఆరాధనం పట్ల అపారమైన ఆసక్తిని చూపించాడు. దానికిగాను ప్రభువు అతన్ని బహూకరించి తన సన్నిధిలోనికి చేర్చుకొన్నాడు. ఆ ప్రవక్తకులాగే మనకుకూడ మంచి మరణం లభించాలని అడుగుకొందాం-2తిమో 4,6-8.

3. ఎలీషా గురువుని సేవించి ధన్యుడయ్యాడు. గురువు శక్తిని పొంది ప్రజలకు మేలు కలిగించే అద్భుతాలు ఎన్నో చేసాడు, శిష్యుడు గురువును గౌరవించి అతని బోధలను జాగ్రత్తగా వినాలి. గురువునుండి దైవానుభూతినీ భక్తి శ్రద్ధలనూ వారసంగా పొందాలి. మనమట్టుకు మనం మన పెద్దలమాట వింటున్నామా? ఆ ఎలీషాలాగ మన పెద్దలకు యోగ్యులమైన వారసులంగా ప్రవర్తిస్తూంటామా?

4. ప్రవక్తను గౌరవిస్తే దేవుని దీవెన లభిస్తుంది. యెలీషా యెరికో పౌరుల కొరకు నీటిని నిర్మలం చేసాడు. ప్రవక్తను అవమానిస్తే దేవుని శాపం వస్తుంది. యెలీషాను ఎగతాళి చేసిన పిల్లలను తోడేళ్ళ చీల్చివేసాయి. మనకు కూడ ప్రభువు సేవకులపట్ల గౌరవముండాలి. వాళ్ళను పూజ్యభావంతో చూడాలి. పైగా దేవుని సేవకులైన గురువులు మఠకన్యలు మొదలైనవాళ్ళ తమ పిలుపుని విలువతో చూచుకోవాలి. తమ అంతస్తుకి తగ్గట్టుగా మసలుకోవాలి. వళ్ళు దగ్గరబెట్టుకొని పవిత్రంగా జీవించాలి. దైవసేవకులకు పవిత్రత ఒక్కటి తగుతుంది.