ఈ పుట అచ్చుదిద్దబడ్డది
7. నాతాను ప్రవచనం
1రాజుల దినచర్య 17
1. సందర్భం
గిల్బోవా యుద్ధంలో ఫిలిస్టీయులు సౌలుని వధించారు. సౌలు కుమారుడు ఈపోృషెతు యిస్రాయేలు పదకొండు తెగలకు రాజయ్యాడు. యూదా తెగమాత్రం దావీదును రాజుగా ఎన్నుకొని అతనికి అభిషేకం చేసింది. పదిన్నరయేండ్లపాటు దావీదు ఈపోృషెతు వైరిరాజులుగా పరిపాలించారు. అటుతర్వాత శత్రువులు ఈష్బోషెకం వధించారు. ఆ పిమ్మట యిస్రాయేలు తెగలన్నవచ్చి దావీదుని దేశానికంతటికి రాజునుగా హెబ్రోనున అభిషేకించాయ.తదనంతరం దావీదు రాజధానిని యెరూషలేముకి మార్చాడు. మందసాన్ని ఆ నగరానికి తోడ్కొని వచ్చాడు. శత్రువులు చాలవరకు లొంగిపోయారు. ఇక అతనికి ඊසාකරයටීක.
2. వివరణం
ఈలాంటి పరిస్థితుల్లో దావీదు నేనైతే దేవదారు కొయ్యతో నిర్మించిన సుందరమైన ప్రాసాదంలో వసిస్తున్నాను. ప్రభువు మందసం మాత్రం దిక్కుమొక్కూ లేకుండా ఓ డేరాలో పడివుంది. ప్రభువు సాన్నిధ్యానికి నా మేడను మించిన మందిరాన్ని కడతాను అనుకొన్నాడు, ఆ యాలోచనను నాతాను ప్రవక్తకు తెలుపగా అతడు నీవు కట్టగోరిన దేవాలయాన్ని కట్టు అని చెప్పాడు. కాని ఆ రాత్రే ప్రభువు వాణి నాతానుతో దావీదు దేవాలయం కట్టగూడదని చెప్పింది. నాతాను ఆ సంగతిని ప్రవచన రూపంలో దావీదుకి తెలియజేసాడు. దాని వివరణమిది. ప్రభువు ఎడారి కాలంలో యిస్రాయేలీయులతో ప్రయాణం చేసినంతకాలం తనకు దేవాలయం కట్టమని ప్రజానాయకులను అడగలేదు. ఆ కాలమంతా ప్రభువు మందసం గుడారంలోనే వుండిపోయింది, యిస్రాయేలీయులు కనాను దేశంలో స్థిరపడిన పిదపగూడ దేవుడు తనకు దేవళం కట్టమని న్యాయాధిపతులను కోరలేదు. ప్రభువు అల్పుడైన దావీదుని ఆదరించాడు. అతడు పొలంలో గొర్రెలు మేపుతూండగా దేవుడు అతన్ని పిలిపించి రాజుని చేసాడు. అతడు చేసిన యుద్థాల్లో అండగా వుండి అతనికి విజయాన్ని ప్రసాదించాడు. ప్రపంచంలోని మహారాజులకు అబ్బే కీర్తి దావీదుకి గూడ లభించేలా చేసాడు. ఇవి ప్రభువు దావీదుకి చేసిన వ్యక్తిగతమైన వపకారాలు. ప్రభువ యిస్రాయేలు సమాజానికి గూడ ఎన్నో వుపకారాలు చేసాడు.వారికి కనాను దేశాన్ని నివాసస్థానం చేసాడు. ఆ దేశపు ఆదిమవాసులు వారికి లొంగిపోయేలా చేసాడు.