వారిని పిలుస్తాడు. నేడు మన పిలుపగూడ ఈలాగే ఆశ్చర్యకరంగా వుంటుంది. యోగ్యులు ఎందరో వుండగా అతడు మనలనే తన సేవకు పిల్చాడు. కనుక మనం భక్తిభావంతో ఆ ప్రభువుకి వందనాలు చెప్పకోవాలి.
2. ఎలీయాబు పెద్దకొడుకు, రూపసి, పొడుగరి. అన్నివిధాల రాజు కాదగినవాడు. కాని దేవుడు అతన్ని ఎన్నుకోలేదు. ప్రభువు హృదయాలు చూచేవాడు. ఎలీయాబు హృదయం అతనికి నచ్చలేదు. నరులమైన మనం వెలుపలి రూపాన్ని చూచి బ్రమసిపోతాం. ఆకారాలు, అందచందాలు, కులం, అధికారం, డిగ్రీలు, మాటతీరు మొదలైనవాటిని చూచి మనం నరులకు విలువనిస్తాం. కాని దేవుని దృష్టిలో ఇవెందుకూ కొరగావు. హృదయాలకు విలువనిచ్చే దేవునికి మన హృదయం నచ్చుతుందా? మనం తోడి నరులను మెప్పిస్తుంటామా లేక దేవుణ్ణి మెప్పిస్తుంటామా? దేవుళ్ళాగే మనంకూడ అంతరంగానికి విలువనీయవద్దా?
3. దావీదు అభిషేకం పొందగానే దేవుని ఆత్మ అతని మీదికి దిగివచ్చింది. ఆయాత్మ యుద్ధబలాన్ని ఇచ్చే ఆత్మ అని చెప్పాం. నాడు యిస్రాయేలీయులకు ముఖ్యంగా కావలసింది ఫిలిస్త్రీయులతో పోరాడే రాజు. కనుక ఆత్మ దావీదుకి ఆ సామర్థ్యాన్ని ఇచ్చింది. నేడు ఆత్మ మనకుకూడ మన అంతస్తుకి తగిన వర ప్రసాదబలాన్ని దయచేస్తుంది. ఆయాత్మడు గురువుకీ, ఉపదేశికీ, మరకన్యకీ సంఘ పెద్దకీ ఉపాధ్యాయునికీ ఎవరికి కావలసిన బలాన్ని వాళ్ళకు దయచేస్తాడు. మన తరపున మనం వినయంతో మనకు కావలసిన వరప్రసాదాన్ని ఆయాత్మ నుండి అడుగుకోవాలి.
6. దావీదు గొల్యాతు
-1 సమూ 17, 1=11, 32-54
1. సందర్భం
దావీదు వీరకృత్యాలు ఎన్నో ప్రసిద్ధిలోకివచ్చాయి. కాని వాటిల్లో గొల్యాతు కథకు వచ్చిన ప్రసిద్ధి దేనికీ రాలేదు. ఈ జీవితంలో మన గొల్యాతులు మనకుంటారు. ఆ దావీదులాగే మనంకూడ దైవబలంతో మన గొల్యాతులను గెల్వాలి.
2. వివరణం
యిస్రాయేలీయులకు ప్రబల శత్రువుల ఫిలిస్టీయులు. వారినిబట్టే కనాను దేశానికి "పాలస్టీనా" అని పేరు వచ్చింది. ఓసారి ఎఫేసు దమ్మీము వద్ద యూదులకు ఫిలిస్ట్రీయులకూ