పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3. ప్రార్ధనా భావాలు

1. సౌలు దేవుని ఆజ్ఞను మీరాడు. అతడు ఆగాగుని చంపలేదు. బలిసిన పశువులను వధింపలేదు. దేవుడు అడగక పోయినా బలిని అర్పించడానికి పూనుకొన్నాడు. తన అనుచరుల వత్తిడికి లొంగిపోయాడు. ప్రభువుకి అవిధేయుడయ్యాడు. అతన్ని పూర్ణహృదయంతో సేవించలేదు. ఈలాంటి అరకొర భక్తి దేవునికి నచ్చదు. కనుకనే ప్రభువు అతన్ని రాజపదవినుండి త్రోసివేసాడు. నేడు మన భక్తి, మన విధేయత ఏలా వున్నాయి? అతడు ఎన్నో సారులు మనలను మన స్థానంనుండి త్రోసివేయవలసింది కదా!

2. ప్రవక్త దేవుని స్థానంలో వుండేవాడు. దేవుని చిత్తాన్ని ప్రజలకు తెలియజెప్పేవాడు. కనుక అతని ఆజ్ఞ మీరితే దేవుని ఆజ్ఞ మీరినట్లే కావుననే మన కథలో రాజు ప్రవక్త ఆజ్ఞ మిరితే దేవుని తన ఆజ్ఞ మీరినట్లే భావించాడు. అతన్ని రాజపదవినుండి త్రోసివేసాడు. రాజుల గ్రంధాల్లో తరచుగా రాజులకీ ప్రవక్తలకీ ఘర్షణలు వస్తుంటాయి. రాజులు ప్రవక్తల ఆజ్ఞలు మీరి పాపం కట్టుకొంటారు. కాని నేడు మనం మన పెద్దల ఆజ్ఞలను ఎంతవరకు పాటిస్తున్నాం? వారి ద్వారా విన్పించే దేవుని మాటలను ఎంతవరకు లెక్కచేస్తున్నాం?

3. దేవుడు సౌలుని రాజపదవినుండి త్రోసివేసాడు. ఇది ఘోరమైన కార్యం. ఇక ప్రభువు సౌలుని మన్ననతో జూడడు. అతనికి బదులుగా దావీదుని ఆదరిస్తాడు. సౌలు మొదటి రాజయి పాముకుందేమిటి? దేవుని ఆదరాన్ని కోల్పోవడం, అతనిచే తిరస్కరించబడ్డం, ఎంత దౌర్భాగ్యం! కాని మనం పాపకార్యాలు చేసినపుడు దేవుడు మనలను మాత్రం త్రోసివేయడం లేదా? పాపం వలన దేవుని ఆదరాభిమానాలను కోల్పోయి మనంమాత్రం దౌర్భాగ్యులం కావడంలేదా?

4. సౌలు అనుచరులు వత్తిడికి లొంగిపోయాడు. వాళ్ళు బలసిన పశువులను దక్కించుకొంటూంటే చూస్తూ వూరకున్నాడు. అతడు అనుచరుల అభిమానాన్ని సంపాదింపగోరి దేవుని అభిమానాన్ని కోల్పోయాడు. మనంకూడ మనకిష్ణులైన వారి అభిమానాన్ని పొందగోరి చేయరాని పనులు చేస్తాం. చేయవలసిన పనులు చేయం. దీనివలన దేవునికి కోపం రప్పిస్తాం, అతని అభిమానాన్ని కోల్పోతాం. ఇది పరమ దౌర్భాగ్యం.