పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాని అబ్రాహాము కత్తిని చేపట్టగానే ప్రభువు ప్రత్యక్షమై ఓయీ! చిన్నవాణ్ణి చంపకు. నీకు అత్యంత ప్రీతిపాత్రుడైన యీసాకుని నాకు బలియిూయడానికి నీవు వెనుకాడలేదు. కనుక నీవు దైవభీతి కలవాడవని రుజువైంది. నీవు నా యాజ్ఞను పాటించి నాకు విధేయుడవయ్యావు. నేను నీ విశ్వాసాన్ని పరీక్షించాను. ఆ పరీక్షలో నీవు నెగ్గావు. అదే చాలు. నేను నీ కుమారుని చావును కోరను అని చెప్పాడు.

 తర్వాత అబ్రాహాముకి ప్రక్క పొదలో కొమ్మలు చిక్కుకొని వున్న పొట్టేలు కన్పించింది. అతడు ఈసాకుని విడిపించి అతనికి బదులుగా ఆ పొట్టేలిని తీసికొనివచ్చి దేవునికి బలిగా అర్పించాడు. యూదులు దేవళంలో తమ తొలిచూలు మగబిడ్డను దేవునికి కానుకగా సమర్పించేవాళ్లు, ఓ గొర్రెపిల్లనో లేక ఓ జత పావురాళ్ళనో దేవునికి కానుకగా అర్పించి ఆ బిడ్డట్టి మళ్ళా విడిపించుకొని పోయేవాళ్ళు. తర్వాతికాలంలో భక్తిలేని యూదరాజులు కొందరు తమ బిడ్డలనే బాలుదేవతకు బలిగా అర్పించారు. యూదులకు ఈ కార్యం ఎంతమాత్రం తగదనీ, పితరుడైన అబ్రాహాము బిడ్డట్టి కాక గొర్రెపిల్లను దేవునికి బలిగా అర్పించాడు చూడండనీ రచయిత ఆనాటి యూదులను హెచ్చరిస్తున్నాడు.
ఈసాకు నాయనా దహనబలికి గొర్రెపిల్ల యేదీ అని అడిగినప్పడు అబ్రాహాము దాన్నిదేవుడే సమకూరుస్తాడని చెప్పాడు కదా! కనుక అబ్రాహాము ఆ మోరీయా ప్రాంతానికి “దేవుడే సమకూరుస్తాడు" అనే అర్థమొచ్చే పేరుపెట్టాడు. కనుక ఈ సంఘటనాన్ని పరస్కరించుకొని "కొండమీద దేవుడే సమకూరుస్తాడు" అని యూదుల భాషలో ఓ సామెత ఏర్పడింది.
నీ సంతతిని లెక్కకందని రీతిగా విస్తరిల్లజేస్తానని ప్రభువు పూర్వమే అబ్రాహాముకి ప్రమాణం చేసాడు. ఆ వాగ్దానాన్ని ఇక్కడ మళ్ళా పునరుద్దాటించాడు. ఆకాశంలోని నక్షత్రాల్లాగ, సముద్రం వొడ్డునవుండే యిసుక ముక్కల్లాగ, నీ సంతానాన్ని అసంఖ్యాకంగా పెంచుతానని దేవుడు అతనికి మళ్ళీ వాగ్దానం చేసాడు, భూమిమీది ప్రజలు నా నుండి దీవెనలు కోరుకొనేపుడు, నీకు కలిగినట్టే తమకూ శుభాలు కలగాలని కోరుకొంటారు అని చెప్పాడు. అనగా అబ్రాహాము భక్తకోటికి ఆదర్శమౌతాడు
ఆ పిమ్మట అబ్రాహాము సంతోషంతో కొండదిగి వచ్చాడు. సేవకులతో కలసి పూర్వం తాను విడిదిచేస్తూన్న బేర్షబాకు తిరిగి వెళ్ళాడు. 
                                                   3. ప్రార్ధనా భావాలు
1. అబ్రాహాము విశ్వాసానికి పెట్టింది పేరు. ఈ గుణం అతనిలో మూడుసార్లు వెల్లడియైంది. మొదటి పర్యాయం, దేవుడు అతన్ని పిల్చినపుడు. కాల్షియా దేశంలో దేవుడు తన్ను పిలువగానే అబ్రాహాము తన సొంత దేశాన్నీ చుట్టపక్కాలనూ వదలిపెట్టి ఈ క్రొత్త దేవుని వెంటబడివచ్చాడు - ఆది 12,1. రెండవ పర్యాయం, 
                                                          142