పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇనుం మనికికి పరీక్ష కొలిమి
   త్రాగి వాదులాడే గర్వాత్మలకు పరీక్ష ద్రాక్షరసం
   మితంగా సేవిస్తే ద్రాక్షారసం నరునికి నూత్నజీవాన్నిస్తుంది
   మధువు లేకపోతే జీవితానికి విలువలేదు
   నరుల ఆనందం కొరకే అది కలిగింపబడింది
   తగిన కాలాన తగినంతగా సేవిస్తే
   ద్రాక్షసవం ఆనందోల్లాసాలను చేకూరుస్తుంది
   కాని మితంమీరి త్రాగితే అది
   ద్వేషం కలహం పతనం తెచ్చి పెడుతుంది
   త్రాగి మత్తెక్కివున్న మూర్ఖదు
   కోపంతో తనకు తానే కీడు చేసికొంటాడు
   అతడు బలాన్ని కోల్ట్టక దిగుతడూ
   పానపాత్రంలో ఎర్రగా నిగనిగలాడేదైనా,
   సులువుగా గొంతులోకి దిగజారేదైనా
   నీవు మద్యానికి బ్రమసిపోవద్దు
   అంతా అయిన తర్వాత అది పాములా కరుస్తుంది
   విషనాగంలా కాటువేస్తుంది
   నీ కంటికి వింతదృశ్యాలు కన్పిస్తాయి
   నీవు పిచ్చిమాటలు పల్ముతావు
   నీకు సముద్రపు అలలమీద ఉయ్యాలలూగినట్లుగా,
   ఓడమీది తెరచాప కొయ్యమీద
   తూలియాడినట్లుగా తోస్తుంది - సీరా 31, 25-20. సామె 23,30-34.
   తోబీతు కూడ తన కుమారుడు తోబియాకు "నీవు ద్రాక్షసారాయాన్ని తప్పత్రాగి
మత్తుడివి కావద్దు. త్రాగుడు అనే వ్యసనానికి లొంగిపోవద్దు" అని హితవు చెప్పాడు – 4,15.

              38. తిండిపోతుతనం
    విందులు ఆరగించేపుడు జాగ్రత్తగా మెలగాలి. చాల మందికి కడుపు నిండినా

కండ్లు నిండవు. ప్రక్కవారిని త్రోసుకొంటూ బోయి మనకు కావలసిన ఆహారపదార్థాలను తెచ్చుకోగూడదు. తిండిమీది కోర్మెను కాస్త అదుపులో పెట్టుకోవాలి. ఆత్రంతో తినకూడదు. పంక్తినుండి అందరికంటె ముందులేస్తే మర్యాదగా వుంటుంది. మితంగా భుజిస్తే చక్కగా

                                119