పోతాడు అన్నారు కొందరు. ఈ మార్గం ప్రకారం నరుని సహకారంతో గాని, స్వాతంత్ర్యంతోగాని అట్టే అవసరం లేదు. మరి కొందరు “మర్కట న్యాయం" ఎన్నుకొన్నారు. కోతిపిల్ల తల్లికడుపునకు కరచుకొని ఉంటుంది. కోతి దానిని పట్టుకోదు. అదే కల్లి కడుపునకు అంటిపెట్టుకొని వుంటుంది. ఈలాగే మనంతట మనమే భాగవంతునికి అంటిపెట్టుకొని వండాలి అన్నారు మరికొందరు. ఈ మార్గం ప్రకారం నరుని సహకారం చాల ముఖ్యం. ఇవి రెండూ భక్తిమార్గాలే. రెండింటి ప్రకారము నరుడు తన్ను తాను భగవంతునికి అర్పించుకోవాలి. ఈ యాత్మార్పణకే "ప్రపత్తి" అని పేరు. (వరప్రసాదాన్ని గూర్చిన క్యాతలిక్ సమాజం బోధలు మర్మట న్యాయానికి దగ్గరగా వుంటాయి. ప్రోటస్టెంటు సమాజం బోధలు మార్థాలన్యాయానికి దగ్గరగా వుంటాయి.)
4 వరప్రసాదమూ, సత్కార్యాలూ
మన సత్కార్యాలవల్ల వరప్రసాదం పెరుగుతుందని మనం భావిస్తాం. హిందూ సంప్రదాయంలోకూడ కర్మమార్గమనేది వుంది. స్వధర్మాన్ని పాటించడమే ఉత్తమ కర్మ. కాని ఈ కర్మలు ఏం చేస్తాయి? అవి మనకు వరప్రసాదం ఆర్ధించిపెట్టవు. పునర్మజన్మనుండి విముక్తిపొందడానికి మాత్రం ఉపయోగపడతాయి. పైగా కర్మమార్గం భక్తిమార్గం కంటే తక్కువది. కనుక మన సత్కార్యాలకూ, వరప్రసాదానికీ సంబంధం లేదు.
5. మోక్షం, అవతారం, సమాజం
1) మోక్షం
: మనం వరప్రసాద జీవితమే మోక్ష జీవితంగా మారిపోతుందనీ, ఇది పిందె, అది పండు అనీ చెప్తాం, హిందూ సంప్రదాయంలో వరప్రసాదానికీ, మోక్షానికీ సంబంధం అట్టేలేదు. ఐనా వరప్రసాదంద్వారా మాయ నుండి తప్పకొని నేనూ భగవంతుట్టేనని తెలిసికొంటాం గనుక అది పరోక్షంగా మోక్షకారణ మౌతుంది. మనకు మోక్షమంటే దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుని సన్నిధిలోవుండడం. హిందువులకు మోక్షమంటే పునర్జన్మలను బాసి మళ్లా దేవునితో కలిసిపోవడం. ఈ కలిసిపోవడంలోకూడ మల్లా భేదాలున్నాయి. కొందరు దేవునితో ఒకటిగా కలిసిపోతామన్నారు. కొందరు అలాకాదు, దేవుని సన్నిధిలో వుండిపోతామన్నారు. దేవుని వ్యక్తిత్వమూ, మన వ్యక్తిత్వమూ వేరువేరుగా వుంటాయన్నారు.
2) అవతారం
: మనం భగవంతుడు నరావతారం పొందాడనీ, అతడే క్రీస్తనీ నమ్ముతాం. ఆ క్రీస్తు తన మరణోత్థానాలవలన మనకు వరప్రసాదం సంపాదించిపెట్టాడనీ, జ్ఞానస్నానంద్వారా అతనితో ఐక్యమై అతని వరప్రసాదం పొందుతామని చెప్తాం. హిందూ సంప్రదాయంలోకూడ రామకృష్ణాది అవతారాలున్నాయి. కాని ఈ యవతారం ద్వారా