పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/301

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

9. జానదేహం

ఉత్థాన క్రీస్తు మన మధ్యలో నెలకొని వుండేలా చేసే సంస్థ శ్రీసభ ప్రభువు ఆర్థించిన వరప్రసాదాలు శ్రీసభ ద్వారాగాని మనలను చేరవు. ఈ శ్రీసభనే పౌలు "జ్ఞానదేహం" అని పిలుస్తుంటాడు. ఇక్కడ మూడంశాలు విచారిద్దాం.

1. జ్ఞానదేహ సిదాంతం

పూర్వవేదంలో ప్రభువు యిప్రాయేలు ప్రజలను వ్యక్తిగతంగా గాక, ఓ జాతిగా ఎన్నుకున్నాడు. యిప్రాయేలు ప్రజలంతా గలసి యావే పుత్రుడు. వారిది సాంఘికమైన వ్యక్తిత్వం, ఈ పూర్వవేదపు సాంఘిక వ్యక్తిత్వమే నూత్నవేదానికి అన్వయించినపుడు జ్ఞానదేహం అని చెప్పబడుతుంది. పౌలు “జ్ఞానదేహం" అనే శబ్దాన్ని ఎక్కడా వాడలేదుగాని, దాని సిద్దాంతాన్ని మాత్రం వివరించాడు. క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొందిన వాళ్ళంతా క్రీస్తు అవయవాలుగా ఏర్పడతారు. విశ్వాసులూ క్రీస్తు కలిసి ఒక్క వ్యక్తిగా ఒసగూడుతారు. ఈ యైక్యత జ్ఞానస్నానం ద్వారా, దివ్యసత్రసాదం ద్వారా సిద్ధిస్తుంది.
జ్ఞానస్నానం ద్వారా క్రీస్తుతో మరణిస్తాం. క్రీస్తుతో ఉత్తాన మౌతాం. క్రీస్తుకు ఆంకితమౌతాం. క్రీస్తనే వాతావరణంలో జీవిస్తాం - రోమా 6,1-11. ఈ క్రీస్తు జీవితాన్నే దివ్యసత్రసాదం కూడ పోషించి పెద్ద జేస్తుంది. ఒకే రొట్టెను భుజించిన వాళ్ళంతా ప్రభువుతో ఒక్క దేహమౌతారు. ఆ ప్రభువు ద్వారా తోడి ప్రజలతోను ఐక్యమౌతారు. 1కొ 10, 17.
శరీరంలో ఎన్నో అవయవాలుంటాయి. ఐనా అవన్నీ ఒక్క దేహ మౌతాయి. ఈలాగే విశ్వాసులంతా క్రీస్తుతో ఒక్క దేహమౌతారు - 1కొ 12,12. ఈ దేహానికి శిరస్సు క్రీస్తే, స్త్రీకి శిరస్సు భర్త, అలాగే విశ్వాసులకు శిరస్సు క్రీస్తు - 1కొ11,3. ఇక్కడ శిరస్సు అంటే నాయకుడు లేక అధిపతి అని అర్థం. క్రీస్తు విశ్వాసులను పిత యొద్దకు నడిపించుకొని పోయే నాయకుడు. రెండవ మోషే.
క్రీస్తుతో ఒక్కటిగా ఐక్యమైన విశ్వాసులు ఆ క్రీస్తు ద్వారా తమలో తాము ఐక్యమౌతారు. ఒక్క రొట్టెగా మారిన గోదుమ గింజలు, ఒక చేరెడు రసంగా మారిన ద్రాక్షపండ్లు, ఒక దేహంగా ఏర్పడిన అవయవాలు తమలో తాము ఐక్యమౌతాయి. ఆవిధంగానే క్రీస్తుతో ఐక్యమైన విశ్వాసులూ తమలో తాము ఐక్యమౌతారు. అనగా క్రీస్తునందు అందరూ అక్కచెల్లెళూ అన్నదమ్ములూ ఔతారు. దేహంలోని అవయవాలు ఒకదాని కొకటి ఉపయోగపడినట్లే మనమూ ఒకరి కొకరం ఉపయోగపడాలి - రోమీ12, 4.