4 ప్రభువు ఆజ్ఞలను పాటించేవాళ్లు అతని దీవెనలు పొందుతారు. పాటించని వాళ్లు శాపానికి గురౌతారు - ద్వితీ 30, 16-18.
5. పరిశుద్ధ గ్రంథం దైవప్రేరణంవల్ల పుట్టింది. అది సత్యాన్ని బోధిస్తుంది. దోషాన్ని ఖండిస్తుంది. తప్పలను సరిదిద్దుతుంది. సత్ర్పవర్తన నేర్పుతుంది. సత్కార్యాలు చేయిస్తుంది –2 తిమో 3, 16-17.
6. పరిశుద్ధ గ్రంథములోని సంగతులన్నీ మనకు ప్రబోధం కలిగించడానికే వ్రాయబడ్డాయి - రోమా 15,4.
7. జ్ఞానస్నానంద్వారాలాగే వాక్కుద్వారా గూడ మనకు క్రొత్తపట్టువు కలుగుతుంది -1 పేత్రు 1, 23.
8. వాక్కుద్వారా పాపపరిహారం కలిగి హృదయం శుద్ధిచెందుతుంది - యోహా 15, 3. అందుకే కీర్తనకారుడు గూడ "ప్రభో! నీ సమక్షంలో పాపంచేయకుండా ఉండేందుకై నీ వాక్యాన్ని నా హృదయంలో నిల్పుకొన్నాను" అన్నాడు -119, 11.
9. ప్రభువు వాక్కు సజీవమైంది. క్రియాత్మకమైంది. రెండంచుల కత్తికంటె పదునైంది. అంతరంగందాకా కోసుకొని పోతుంది. అది మన హృదయాల్లోని కోర్కెలనూ ఆలోచనలనూ పరిశీలించి చూస్తుంది - హెబ్రే 4,12.
10. నరుడు క్షణమాత్రజీవి. అతడు పొలంలోని గడ్డిలా యెండిపోతాడు. పూవులా వాడిపోతాడు. కాని దేవుని వాక్కు శాశ్వతంగా వుండిపోతుంది - యెష 40, 6-8
(7) మనకు వాక్యాన్ని బోధించేది పరిశుద్ధాత్మే
1. పవిత్రాత్మవచ్చాక మీకు సమస్త విషయాలు బోధిస్తుంది. నేను చెప్పిన సంగతులన్ని మీకు తలపునకు తెస్తుంది - యోహా 14, 26. ఆ యాత్మ మిమ్మ సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. ఆయన తనంతటతాను ఏమీ బోధించక తాను నావలన వినిన సంగతులనే మీకు బోధిస్తాడు - 16, 13.
2. ప్రవచనం అనేది కేవలం మానవ సంకల్పం వలన పుట్టలేదు. ప్రవక్తలు పవిత్రాత్మచే ప్రేరితులై దేవుని సందేశాన్ని విన్పించారు. ఈనాడు మనం బైబులు అర్థంచేసికొనేలా చేసేది కూడ ఆయాత్మే - 2 పేత్రు 1,21.
3. క్రీస్తు ఆత్మ మీయందు ఉన్నంతకాలమూ మీకు మరో బోధకునితో అవసరంలేదు. ఆయాత్మే మీకు అన్ని విషయాలు బోధిస్తుంది -1 యోహా 2, 27
4. బిడ్డలందరు ప్రభువువలన ఉపదేశం పొందుతారు. - యెష54, 31.