తన సిరిసంపదలనూ కోశాగారాన్ని వాళ్ళకు చూపించాడు. ప్రభువు అతని మీద కోపించి ప్రవక్తను బంపి బాబిలోను ప్రజలువచ్చి నీవు చూపించిన ఈ సౌమ్మంతా అపహరించుకొని పోతారు అని చెప్పించాడు - 2 రాజు 20, 12 - 17.
3. యూదులు బాబిలోను ప్రవాసంలో వున్నపుడు మొర్దేకయి వాళ్ళ నాయకుడు. హామాను రాజు కొలువుకాడు. ఓమారు హామాను కొలువుకు వస్తుండగా మొర్దేకయి రాజమందిరంముందు కూర్చుండియుండి పైకిలేవనూలేదు, అతనికి నమస్కారం చేయనూలేదు. హామాను మహా గర్విష్టి అతడు మొర్దేకయిని ఉరిదీయించడానికై ఏబదిమూరల ఉరికంబం తయారుచేయించాడు. కాని ప్రభువు మొర్దేకయిని కాపాడ్డం వల్ల చివరకు హామానే ఆ వురికంబంమీద వ్రేలాడవలసి వచ్చింది - ఎస్తే 3,5.
4. ఉజ్జీయా తెలివైన రాజు, ఈ రాజు కొన్ని మారణ యంత్రాలను కనిపెట్టగా ప్రజలు ఇతన్ని పొగడారు. దానితో పొంగిపోయి అతడు దేవాలయంలో సాంబ్రాణిపొగ వేయబోయాడు. కాని ఎనభై మంది యాజకులు అడ్డువచ్చి ఇది యాజకులు చేయవలసిన పనిగాని రాజు చేయవలసిన కార్యం గాదని అతన్ని వారించారు. ఐనా ఉజ్జీయా వారిమాట విన్పించుకోకుండా అధికార గర్వంతో సాంబ్రాణిపొగ వేయడానికి పీఠందగ్గరికి వచ్చాడు. వెంటనే అతని నొసటిమీద కుష్ఠ పుట్టుక వచ్చింది. యాజకులు అతన్ని దేవాలయం నుండి బయటికి గెంటివేసారు. ఆ మీదట ఉజ్జీయా ఆమరణాంతం ఒంటరిగా వసించవలసివచ్చింది - 2 దినవృ26, 16-21.
5. యాకోబుని చంపించి పేత్రుని చెరలో వేయించిన మూడవ హెరోదు ఓమారు కొలువుదీర్చి ఉపన్యాసమిచ్చాడు. అతని బంటులంతా నీవు ఓ దేవుడిలా మాట్లాడావని పొగడారు. హెరోదు అ పొగడ్డకు ఉబ్బిపోయి తాను నిజంగా దేవుట్టేనని భావించాడు. వెంటనే ఒక దేవదూత ఆ రాజును ఫనోరంగా శిక్షింపగా అతడు పరుగులుపడి చచ్చాడు — ఆచ 12 –22-23.
6. ఓ పరిసయుడూ సుంకరీ ప్రార్ధనచేయడానికి దేవాలయానికి వెళ్ళారు. సుంకరి "ప్రభో? నేను పాపిని నన్ను క్షమించు" అని ప్రార్ధించాడు. కాని పరిసయుడు ప్రభో! నేను ఈ సుంకరిలాంటి వాణ్ణికాదు. నీతిమంతుడ్డి నీకు తెలియందేముంది?" అని ప్రార్థించాడు. దేవుడు ఆ సుంకరి మనవిని ఆలించి పరిసయని మనవిని త్రోసిపుచ్చాడు - లూకా 18, 10-14
7.
1) ప్రభువు ఏవగించుకొనేవి ఏడున్నాయి. అవి అహంకారమూ, అబద్ధాలాడ్డమూ, హత్యచేయడమూ, కీడెంచడమూ, చెడుపనికి పూనుకోవడమూ, కూటసాక్ష్యమూ, తగాదాలు పెట్టడమూను - ਹੇ 6 , 16-19.
2) వినాశానికి ముందుగా అహంకారమూ, పతనానికి ముందుగా ఆహంభావమూ పుట్టుకవస్తాయి - సామె 16, 18.