పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

{{center|

7. దురాశ

ఒకోమారు నరులు దురాశకు లొంగిపోతూంటారు. లోతైన నీళ్ళలోబడి మునిగిపోయినట్లు పేరాసకు చిక్కి నాశమైపోతూంటారు.

1. యోషువా హాయిపట్టణాన్ని ముట్టడించి పోరు సాగిస్తున్నాడు. అందలి వస్తువులనన్నీటినీ శాపంపాలుచేసి కాల్చివేయమని యావే ఆజ్ఞ యిచ్చాడు. కాని యోషువా సైనికుల్లో ఒకడైన ఆకానుమాత్రం హాయిలో దొరికిన దోపిడి సొమ్మను - పట్టుబట్టలనూ నాణాలనూ - దాచుకొన్నాడు. అతడు యావే ఆజ్ఞ మీరినందున యోషువాకు యుద్ధంలో అపజయం కలిగింది. యోషువా విచారణ జరిపి చూడగా ఆకానునేరం బయటపడింది. అంతట ఆకానునీ అతని కుటుంబాన్నీ రాళ్ళతో కొట్టి చంపారు - యోషువా 7.

2. యెలీషా ప్రవక్తగానున్న రోజుల్లో సిరియా సైన్యాధిపతియైన నామాను కుష్టరోగియై చికిత్సకొరకు వచ్చాడు. ప్రవక్త అతన్ని ఏడుసార్లు యోర్దానునదిలో స్నానం చేయమన్నాడు. ఆలా చేయగా నామానుకు కుష్టపోయింది. అతడు యెలిషాకు కానుక లర్పింపబోయాడూని, ప్రవక్త అవేమీ స్వీకరించకుండానే నామానును పంపివేసాడు. కాని యెలీషా శిష్యుడైన గేహసీ దురాశతో నామానువెంట బోయాడు. మా గురువుగారు కానుకలు అడుగుతున్నారని బొంకి ఆతనివద్ద నుండి వెండి నాణాలూ పట్టుబట్టలూ ఇప్పించుకొని వచ్చాడు. గేహసీ యెలీషాకు పరిచర్య చేయడానికి రాగానే ప్రవక్త అతనిమీద మండిపడి “నాయాత్మనీతోకూడ వచ్చి నీవు చేసిన పాడుపని చూచింది. నీవు ఈలాంటి అకార్యానికి పాల్పడ్డావు గనుక నామానును వదలిపోయిన కుష్ట నిన్ను పట్టి పీడిస్తుంది" అన్నాడు. వెంటనే గేహసీకి కుష్టసోకగా అతని వొళ్ళు మంచులాగ తెల్లబడిపోయింది - 2 రాజు 5, 20-27.

3. సాలు అమాలెకీయుల మీదికి యుద్దానికి పోయాడు. ప్రభువు అమాలెకీయులను శాపంపాలుచేసి సర్వనాశంచేయమని చెప్పాడు. కాని సౌలు అమాలెకీయుల రాజైన అగాగును చంపకుండ వదలివేసాడు. పైగా అతడు అమాలెకీయుల గొడ్లలో పోతరించిన యెడ్లను దూడలను గొర్రెలను చంపలేదు. శ్రేష్టమైన జంతువులన్నిటిని తాను మిగుల్చుకొని క్షుద్రజంతువులను మాత్రం శాపంపాలుచేసి వధించాడు. అంతట ప్రభువు పంపగా సమూవేలు ప్రవక్త వచ్చి సౌలును చెడబడ తిట్టాడు. నీవు యావేమాట త్రోసివేసాడు గనుక యావే నీ రాచరికం త్రోసివేసాడు అని చెప్పాడు. దానితో సౌలు రాజదవి కోల్పోయాడు -1సమూ 15, 9.

4 అహాబు దుష్టరాజు. అతని మేడ ప్రక్కనే నాబోతు అనే పేదవాని పొలముండేది. ఆ రాజుకు ఆ పొలంమీద ఆశ పుట్టింది. అతడు నేను కూరగాయలు పండించుకోవాలి