పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2ఇంకో వర్గంవారికి జ్ఞానస్నానం పొందాలనే కోరిక వుంటుంది కాని సాంఘిక, సాంస్కృతిక కారణాలవల్ల పొందలేరు. వీరికి క్రీస్తుపట్ల విశ్వాసం వుంటుంది. సంస్కారాలు మాత్రం లేవు. వీళ్ళు క్రీస్తుకి సాక్షులుగా వుంటారు. లోకానికి సువిశేష విలువలను తెలియజేసి దైవరాజ్యాన్ని నిర్మిస్తారు. ఈ ప్రజలుకూడ తిరుసభ సభ్యులే.

3. కొందరు వాళ్ల ప్రత్యేక మతంలోనే వుంటారు. కాని క్రీస్తునీ సువిశేష విలువలనూ అంగీకరిస్తారు. వాటిని తమ సొంత మత విలువలతో జోడిస్తారు. క్రీస్తుపట్ల భక్తిప్రపత్తులు చూపుతారు. సువిశేష విలువలను పాటిస్తూ దైవరాజ్యాన్ని స్థాపిస్తారు. ఈలాంటివాళ్ళకూడ తిరుసభ సభ్యులే.

4. ఇంకా కొందరు ఏ మతానికి చెందివుండరు. కాని క్రీస్తునీ సువిశేష విలువలనూ అంగీకరిస్తారు. కొంతమంది సంఘసేవకులు ఈలాంటివాళ్ళు వీళ్ళ దృష్టిలో క్రీస్తు సమాజంలోని అన్యాయాలనూ అవినీతిని తొలగించేవాడు. వీళ్ళు తిరుసభకు చెందివుండాలనుకోరు. దైవరాజ్య స్థాపనకు మాత్రం కృషి చేస్తారు. తమ జీవితంలో సువిశేష విలువలను పాటిస్తారు. దైవరాజ్యాన్ని నెలకొల్పేవాళ్ళు కనుక వీళ్ళకూడ తిరుసభ సభ్యులే.

ఈ దృష్టితో చూస్తే తిరుసభ చాల విస్తృతమైంది. దైవరాజ్యం కొరకు కృషి చేసేవాళ్ళంతా తిరుసభ సభ్యులే. ఈ ప్రజలంతా క్రైస్తవారాధనలో పాల్గొనక పోవచ్చు. కాని కొన్ని పర్యాయాలు వీళ్ళ ఆరాధనాపద్ధతి వీళ్ళకుంటుంది. కాని తిరుసభ సభ్యులందరికీ క్రీస్తు అనే వ్యక్తిపట్ల నమ్మకం వుంటుంది. కేవలం సువిశేష విలువలను అంగీకరిస్తేనే చాలదు. వాటికి కారకుడైన క్రీస్తుని అంగీకరించాలి. అతన్నిబట్టి సువిశేష విలువలకు విలువ వచ్చింది. ప్రధానమైన తండ్రి సువిశేషం అతడే.

భారతదేశ పౌరులు ఎక్కువగా క్రైస్తవులుకారు. అట్లని మనం వేదబోధ మానుకోగూడదు. మన సువిశేష బోధ భిన్న వర్గాలమీద భిన్న ప్రభావం చూపుతుంది. ఎవరికి ఇష్టమైనంతవరకు వాళ్ళ సువిశేష విలువలను స్వీకరిస్తారు. ఈ విలువలను ఏపాటిగా స్వీకరించినా వారి హృదయంలో క్రీస్తు సాన్నిధ్యం కొంతవరకు నెలకొంటుంది. వాళ్ళు తిరుసభకు చెందకపోయినా దైవరాజ్యానికి చెందుతారు. కనుక మన తరపున మనం వేదబోధ చేయవలసిందే. వినేవాళ్ళ వింటారు. విననివాళ్ళు వినరు.

4. మూలిక సంఘూలు

ఇటీవల తిరుసభలో మౌలిక సంఘాలు అనే నూత్న సమాజాలు వెలిసాయి, ఇవి తిరుసభను పరిపష్టం చేయడానికి బాగా వుపయోగపడతాయి. అపోస్తలుల చర్యల