ప్రార్థనా భావాలు
1.రెండవ శతాబ్దంలో జీవించిన ఓరిజన్ పండితుడు ఓ వుపమానం చెప్పాడు. మనలోని ఆత్మ కదిలిస్తేనేగాని మన దేహానికి చైతన్యం పుట్టదు. అలాగే క్రీస్తు కదిలిస్తేనేగాని అతని దేహమైన తిరుసభకు చైతన్యం కలగదు. ఆ ప్రభువు తిరుసభలోని నరులందరికీ, ఒక్కొక్కరికిగూడ, చైతన్యం కలిగించేవాడు. కనుక మన శిరస్సయిన క్రీస్తు మనకు ప్రబోధం కలిగించాలని వేడుకొందాం.
2.మరియమాత తిరుసభకు పోలికగా, ఆదర్శంగా వుంటుంది. మరియలాగే తిరుసభకూడ ఈ లోకంలో పవిత్రంగా జీవించాలి. దేవుని చిత్తానికి బదురాలు కావాలి. ఆమెలాగే తిరుసభ కూడ పరలోకంలో మహిమను పొందాలి. తిరుసభను పవిత్రంగా జీవించేలా చేయమని మరియమాతను ప్రార్థిద్దాం.
ప్రశ్నలు
అధ్యాయం - 1
1.దైవరాజ్యాన్ని గూర్చిన పూర్వవేద బోధలూ, క్రీస్తు నాటి రాజకీయవాదుల బోధలూ తెలియజేయండి.
2.దైవరాజ్యాన్ని గూర్చిన క్రీస్తు బోధలను వివరించండి.
అధ్యాయం - 2
1.క్రీస్తు పండ్రెండుమంది శిష్యులను నియమించడంవల్ల కాని లేక పేత్రుకి ఆధిపత్యం దయచేయడంవల్ల కాని అతనికి తిరుసభను స్థాపించాలనే కోరిక వుందని రుజువు చేయండి.
2.దివ్యసత్రసాదాన్ని స్థాపించడంద్వారా క్రీస్తుకి తిరుసభను నెలకొల్పాలనే కోరిక వుందని నిరూపించండి.
3.అపోస్తలుల చర్యలు అనే గ్రంథంనుండి తిరుసభ యేలా పుట్టి పెంపుజెందిందో తెలియజేయండి.