పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(పోపుగార్లు) తిరుసభ అంతటివిూద అధికారం నెరపుతూ వచ్చారు. తొలి శతాబ్దాల్లోనే విశ్వతిరుసభలోని మేత్రాసనాలన్నీ రోము అధికారాన్ని గుర్తించాయి. ఈమేత్రాసనాల్లో తగాదాలు కాని సందేహాలు కాని వచ్చినప్పడు రోము బిషప్ప జోక్యం జేసికొని వాటిని పరిష్కరించేవాడు. ఉదాహరణకు కొరింతుసభలో గొడవలు రాగా రోముకి బిషప్పయిన క్లెమెంటు జోక్యం జేసికొని వాటిని చక్కదిద్దాడు. అంటియోకయ బిషప్పయిన ఇగ్నేప్యస్ రోమను క్రైస్తవులకు జాబు వ్రాస్తూ “రోము ప్రేమతో అధ్యక్షతను వహిస్తుంది" అని వాకొన్నాడు. ఇరెనేయస్ వేదశాస్త్రి "రోమపీఠాన్ని పేత్రు పౌలులు స్థాపించారు కనుక దానికి ఓ ప్రత్యేకత వుంది. అపోస్తలుల సంప్రదాయం దానిలోనే కొనసాగుతుంది. కనుక తిరుసభలోని మేత్రాసనాలన్నీ రోముని ఆదర్శంగా పెట్టుకోవాలి” అని వ్రాసాడు. సిప్రియన్ రోము బిషప్ప పేత్రుస్థానాన్ని పొంది అతని సింహాసనాన్ని ఎక్కుతాడని చెప్పాడు. రోముతో ఐక్యమైయున్నంత వరకే ఇతర తిరుసభలకు విలువ వుంటుదని ఒస్టేటస్ వాకొన్నాడు. పేత్రు ఎక్కడున్నాడో అక్కడే తిరుసభ కూడ వుంటుంది అని ఆంబ్రోసు నుడివాడు. ఈ యాధారాలనుబట్టి రోము బిషప్పల ప్రాధాన్యాన్ని అర్థం చేసికోవచ్చు పేత్రు స్థానాన్ని పొందడం వల్లనే వాళ్ళకు ఈ ప్రాముఖ్యం వచ్చింది. ప్రాచీన కాలంలో ఒక్కరోము పీఠం తప్ప మరేపీఠంగూడ తనకీ ప్రాముఖ్యం ఉన్నట్లుగా చెప్పకోలేదు.

నాల్గవ శతాబ్దంనుండి ఆయా మేత్రాసనాల్లోని బిషప్పలు చిక్కులు వచ్చినపుడల్లా రోము సహాయాన్ని అర్థించేవాళ్లు. తిరుసభనుండి విడిపోయిన పతితులు మళ్లా దానిలోనికి వచ్చినపుడు ముందుగా రోము అనుమతిని పొందేవాళ్ళు రోము జ్ఞానస్నాన విధానమే ఇతర మేత్రాసనాలుకూడ అనుసరించాయి. వేదగ్రంథాలసంఖ్యను నిర్ణయించింది రోము పీఠమే. తొలి శతాబ్దాల్లోని పతితులతో తీవ్రంగా పోరాడింది రోమే. వీటన్నిటిని బట్టి రోము పీఠాధిపతుల అధికారము అర్థంజేసికోవచ్చు.

2. మొదటి వాటికన్ సభ ప్రకటనం



1870లో మొదటి వాటికన్ మహానభ పోపుగారి ప్రధానత్వాన్ని అధికారపూర్వకంగా ప్రకటించింది, సంగ్రహంగా ఈ సభ ప్రకటనం ఇది. పోపుగారికి తిరుసభ అంతటి మీద సంపూర్ణమూ సర్వోన్నతమూ ఐన అధికారం వుంది. ఈ యధికారం విశ్వాసానికీ నైతికాంశాలకూ మాత్రమేగాక తిరుసభ క్రమశిక్షణకూ పరిపాలనకూగూడ వర్తిస్తుంది. ప్రతి మేత్రాసనంలోను బిషప్పలమిూదా విశ్వాసులమిూదా పోపుగారికి సంపూర్ణాధికారం వుంటుంది.