పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2. పేత్రు స్థానంలో పోపుగారు

ఇంతవరకు శిష్యుల్లో పేత్రు ప్రధానుడని రుజువు చేసాం. ఇక, ఈ ప్రధానత్వం పోపుగారికి ఏలా సంక్రమించిందో పరిశీలిద్దాం. ఇక్కడ మనకు ఆధారం చరిత్రే.
 
క్యాతలిక్ తిరుసభ నమ్మకం ప్రకారం రోము బిషప్పయిన పోపుగారు పేత్రుకి వారసుడు. రోము బిషప్పే పేత్రుకి ఎందుకు వారసుడు కావాలి? ఇతర బిషప్పలు ఎందుకు కాకూడదు? పేత్రు రోము పీరానికి అధిపతిగా వుండి అక్కడే వేదసాక్షిగా చనిపోయాడు కనుక, కాని పేత్రు రోము పీఠానికి అధిపతి అని మనకెలా తెలుసు?

అపోస్తలుల చర్యలు 12, 17 పేత్రు యెరూషలేము నుండి "వేరొక చోటికి" వెళ్లాడు అని చెప్తుంది. ఈ వేరొకచోటు రోమే ఐయండాలి, ఎందుకంటే, మొదటి పేత్రు జాబు 5,13. "బాబిలోనియాలోని తిరుసభ మిమ్ము అడిగినట్లు చెప్తుంది” అని నుడువుతుంది. ఈ "బాబిలోనియా" రోమే. ఈ రోముకి పీఠాధిపతియైన పేత్రు వ్రాసిన జాబే యిది.

తొలి రెండు శతాబ్దాల్లోని వేదసాక్షులూ భక్తులూ పేత్రు రోము పీఠాధిపతి అని రూఢిగా చెప్తున్నారు. అంటియోకయా బిషప్పయిన ఇన్యాసివారు రోమిూయులకు వ్రాసిన జాబులో “అపోస్తలులయిన పేత్రు పౌలుల్లాగ నేను మియాకు ఉపదేశం చేయలేను" అని వ్రాసాడు. పేత్రు రోముకి బిషప్పని ఇగ్నేప్యస్కి తెలుసు. కోరింతులో వసించిన డయొనీష్యస్ అనే భక్తుడు పేత్రుపౌలులు రోములో వేదబోధచేసి అక్కడే వేదసాక్షులుగా మరణించారని నుడివాడు. ఇరెనేయస్ వేదశాస్త్రి వ్రాతల ప్రకారం పేత్రు పౌలులు రోములోని తిరుసభను స్థాపించారు. రోములోని ఇప్పటి పేత్రు పెద్దగుడి అడుగున పేత్రు సమాధి కూడ వుంది. ఈలాంటి ఆధారాలనుబట్టి పేత్రు రోముకి బిషప్పగావుండి అక్కడే ప్రాణాలు విడిచాడని అర్థం జేసికోవాలి. ఈ సత్యాన్ని క్యాతలిక్, ప్రొటస్టెంటు క్రైస్తవులు కూడ అంగీకరిస్తారు.

కాని పేత్రు యెరూషలేమునుండి రోముకి ఎందుకువెళ్లాడు? మనకు రూఢిగా తెలియదు. బైబులు ఏమిూ చెప్పదు. ఆ రోజుల్లో రోము ప్రపంచంలో ముఖ్యమైన నగరం. మొదట అక్కడ క్రైస్తవ బోధ జరిగితే తర్వాత ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు కూడ ప్రాకుతుంది. కనుక పవిత్రాత్మే పేత్రుని ప్రేరేపించి రోముకి తీసికొనిపోయి వుండవచ్చు. అతనితో క్రైస్తవ కేంద్రం యెరూషలేమునుండి రోముకి మారింది. పేత్రు అపోస్తలులకు పెద్ద కనుక సహజంగానే రోముకి బిషప్పయ్యాడు. పేత్రు తర్వాత రోముకి బిషప్పలైనవాళ్లు సహజంగానే అతనికి వారసులయ్యారు. వీళ్లే పోపుగార్లు. పేత్రు అపోస్తలులలో ప్రధానుడు కనుక ఆ ప్రధానత్వం అతని వారసులకు కూడ లభించింది. కనుక రోమాపురి బిషప్పలు