పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మన తరపున మనం తిరుసభ పవిత్రతనీ మాలిన్యాన్నీ కూడ గుర్తిస్తుండాలి. ఇంకా మనలోని వెల్లురునీ చీకటినీ కూడ నిరంతరం గమనిస్తూండాలి. రోజురోజుకీ ఆ చీకటిని తగ్గించుకొని వెల్లురుని పెంచుకొంటూండాలి.

4. ప్రేషితులకు వారస సమాజం

పేత్రు యోహాను మొదలైన తొలి పండ్రెండుమంది ప్రేషితులు నెలకొల్పిన తొలి క్రైస్తవ సమాజనికి వారసంగా వచ్చింది తిరుసభ తొలి పండ్రెండుమంది శిష్యులు స్థాపించిన తిరుసభ వారితో అంతరించలేదు. అది నేటి తిరుసభలో ఇంకా కొనసాగుతూనే వుంది. ప్రస్తుత తిరుసభ అనే గొలుసు ఆ తొలి తిరుసభ అనే కొక్మానికి అతుక్కొని వుంది. అందుకే విశ్వాస సంగ్రహంలో “అపోస్తోలిక తిరుసభను విశ్వసిస్తున్నాను" అంటాం. అనగా ఇప్పటి తిరుసభ తొలి పండ్రెండుమంది అపోస్తలులతో ప్రత్యక్ష సంబంధం కలది అని భావం. ఈ సభ ఎప్పడో, ఎక్కడో క్రొత్తగా వూడిపడలేదని అర్థం.

దైవరాజ్యాన్ని బోధించడానికి మొదట తండ్రి క్రీస్తుని పంపాడు. క్రీస్తు తన తరపున తాను శిష్యులను పంపుతూ తండ్రి నన్ను పంపినట్లే నేనూ మిమ్మ పంపుతున్నాను" అన్నాడు - యోహా 20,21. వాళ్ళను వెళ్లి సకల జాతులకు తన్ను గూర్చి బోధించమని చెప్పాడు. తాను లోకాంతం వరకు వాళ్ళతో వుంటానని హామిూ యిచ్చాడు - మత్త 28,19–20. వాళ్ళ తర్వాత వాళ్ళ శిష్యులూ ప్రశిష్యులూ వాళ్ళ స్థాపించిన తిరుసభను కొనసాగిస్తూ వచ్చారు. అదే నేటి మన తిరుసభ, క్రీస్తు ప్రారంభించగా అపోస్తలులు వ్యాప్తి చేసిన దైవరాజ్యమే నేడు తిరుసభగా కొనసాగుతూంది. తొలి మూడు గుణాలవలె ప్రేషితులకు వారసంగా వుండడమనే ఈ నాల్గవ గుణం కూడ తిరుసభకు ఆత్మనుండే లభించింది.

కాని ఏ ముఖ్య విషయంలో తిరుసభ అప్లోలులకు వారస సమాజంగా వుంటుంది? అపోస్తలులకు ప్రత్యేక భాగ్యాలున్నాయి. వాళ్లు క్రీస్తుతో కలసి జీవించారు. ఉత్తాన క్రీస్తుని చూచారు. అతని ఆజ్ఞవల్లనే దైవరాజ్యబోధకు పూనుకొన్నారు. ఈ కార్యాలన్నిటిద్వారా వాళ్ళు తిరుసభకు పునాదిలాంటి వాళ్ళయ్యారు. ఈలా పునాదిగా వుండడం అనే లక్షణం అపోస్తలులతోనే అంతరించింది. ఆ లక్షణం వాళ్ల అనుయాయులకు రాదు.

కాని అపోస్తలులు క్రీస్తు బోధనకు కొనసాగించవలసిన పూచీకలవాళ్ళు. ఈ పూచీ, దైవరాజ్యబోధ అనే పని, అపోస్తలులతోపాటు వారి అనుయాయులకు గూడ సంక్రమించింది. 142