బంధింపబడి వుంటుంది. ఐనా అది దేహంలోని అవయాలన్నిటినీ ఒక్కటిగా బంధిస్తుంది. అలాగే క్రైస్తవులు ఈ లోకంలో బంధింపబడి వున్నారు. ఐనా వాళ్ళు లోకాన్నంతటినీ బంధించి వుంచుతారు. నాశంలేని ఆత్మ నాశమయ్యే దేహంలో నెలకొని వుంటుంది. అలాగే క్రైస్తవులు నాశమయ్యే ఈలోక వస్తువులు మధ్య వసిస్తున్నా వారి ఆత్మలు మత్రం అవినాశమైన పరలోకం విూదనే దృష్టి నిల్పి వుంటాయి". ఈ రచయిత తిరుసభ స్వభావాన్ని చక్కగా వర్ణించాడు. మనంకూడ ఈ భక్తుడు చెప్పిన సూత్రాల ప్రకారం జీవించాలని ప్రభువుని వేడుకొందాం.
7. తిరుసభ లక్షణాలు
ఈ యధ్యాయంలో నిజమైన తిరుసభ లక్షణాలను నాల్డింటిని పరిశీలిద్దాం. ఈ లక్షణాలు కొంతవరకు ప్రొటస్టెంటు సమాజాల్లో కూడ కన్పించవచ్చు. కాని యివి పరిపూర్ణంగా క్యాతలిక్ తిరుసభలో మాత్రమే కన్పిస్తాయి. తిరుసభలో ఏకత, విశ్వవ్యాప్తత, పవిత్రత, పేషితులకు వారస సమాజంగా వుండడం అనే ముఖ్య లక్షణాలు నాల్గు కన్పిస్తాయి. విశ్వాస సంగ్రహంలో మనం ఈ లక్షణాల నుద్దేశించే “ఏక పవిత్ర, కతోలిక, అపోస్తలిక తిరుసభను విశ్వసించుచున్నాను" అని చెప్తాం.
1.ఏకత
తిరుసభతోపాటు లోకంలో ప్రొటస్టెంటు సమాజాలు కూడ వున్నాయి. మనకు వీటితో పొత్తులేదు. కనుక నేడు క్రీస్తు స్థాపించిన తిరుసభలో అనైక్యత, విభజనం వుందని చెప్పాలి. అటువైపు చాలమంది ప్రోటస్టెంటు క్రైస్తవులూ, ఇటువైపు చాలమంది క్యాతలిక్ క్రైస్తవులూ క్రైస్తవ సంఘాలన్నీ ఐక్యంగావాలనే కోరుకొంటున్నారు. దీనికొరకు కృషి చేస్తున్నారు కూడ. కాని ఈ యైక్యత నేటివరకు సిద్ధించలేదు. క్రైస్తవుల్లోని ఈ అనైక్యత కారణంగా అన్యమతస్తులు క్రైస్తవమతాన్ని చిన్నచూపు చూస్తున్నారు. క్రీస్తకోరిన ఏక సమాజం ఏదీ అని అడుగుతున్నారు. కనుక ఈ యైక్యతను సాధించడం క్రైస్తవులందరి బాధ్యత.
నూత్నవేదం చాల తావుల్లో, క్రీస్తు స్థాపించిన తిరుసభలో ఐక్యత వుండాలని బోధిస్తుంది. క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొందిన వాళ్ళల్లో లింగభేదం వర్గభేదం జాతిభేదం వండకూడదు. వాళ్ళంతా క్రీస్తునందు సరిసమానం, ఏకసమాజం కావాలి కా గల 3.2728. దేహంలోని అవయవాలన్నీ కలసి ఒక్క శరీరమౌతాయి. అలాగే క్రీస్తు అవయవాలమైన మనమంతా కలసి ఆ ప్రభువునందు ఒక్క తిరుసభ కావాలి - రోమా 12,4-5.