పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మనమిప్పుడు పరిశీలించి చూడలేం. వీటిల్లో ముఖ్యమైనవి ఏడెన్మిది వున్నాయి. వీటిల్లో * ప్రస్తుతానికి మూడింటిని మాత్రం పరిశీలిద్దాం. అవి దైవప్రజ, క్రీస్తుదేహం, పవిత్రాత్మకు ఆలయం అనేవి.

1. తిరుసభ దైవప్రజ

తిరుసభలోని ప్రజలందరు, అనగా పోపుగారు కార్డినళ్లు బిషప్ప్పులు గురువులు మఠవాసులు గృహస్తులు అందరు దైవప్రజలే దైవప్రజలైనంతవరకు వీళ్ళందరు సరిసమానులే. దేవుడే వీళ్ళందరిని కరుణతో ఎన్నుకొని తన ప్రజలనుగా జేసికొన్నాడు. దైవప్రజలంతా దేవునికి అంకితమైనవాళ్లు, ఆ ప్రభువుని స్తుతించి కీర్తించి సేవించడం, అతన్ని ఇతరులకు గూడ చూపించడం వారి బాధ్యత. పూర్వనూత్నవేదాలు కూడ ఈ దైవప్రజను గురించి సవిస్తరంగా పేర్కొంటాయి.

1. పూర్వవేదంతో దైవప్రజ

పూర్వవేదం దైవప్రజను గూర్చి ఐదంశాలు చెప్తుంది. వీటిని క్రమంగా పరిశీలిద్దాం.

1. సీనాయి నిబంధనం ద్వారా యూదులు దైవప్రజలయ్యారు. కనుక వాళ్ళ జీవితంలో ఈ నిబంధనం ముఖ్యాతిముఖ్యమైంది. ఈ నిబంధనం చేసికొన్నపుడు ప్రభువు యూదులకు చెప్పిన వాక్యాలివి. "మిూరు నా మాట విని నా నిబంధనను జాగ్రత్తగా పాటిస్తే సకల జాతుల్లోను మిూరే నావారు, నా సాంతప్రజలు ఔతారు. ఈ భూమండలమంత నాదే కదా! విూరే నాకు యాజకరూప రాజ్యం, మిరే నా పవిత్ర ప్రజ? - నిర్ణ 19,5-6.

యిస్రాయేలీయులు నిబంధనం ద్వారా ఏలా యావే ప్రజలయ్యారో ఈ వాక్యాలు తెలియజేస్తాయి. ఈ నిబంధన కాలంనుండి "మిూరు నా ప్రజలు, నేను మిూ దేవుణ్ణి" అనే పలుకుబడి ప్రచారంలోకి వచ్చింది. ప్రభువు యూదుల మంచితనాన్ని బట్టిగాని సంఖ్యనుబట్టిగాని వాళ్ళను తన వారినిగా ఎన్నుకోలేదు. కేవలం తన ప్రేమనుబట్టి మాత్రమే వారిని తన ప్రజనుగా జేసికొన్నాడు - ద్వితీ 7,7-8.

ప్రభువు తన సేవకుడైన మోషేద్వారా యూదులకు ధర్మశాస్తాన్ని దయచేసాడు. వాళ్లు ఆ ధర్మశాస్త్ర విధులను ఖండితంగా పాటించాలి. ఈలా పాటించడం నిబంధనంలో *, భాగం.