పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అవసరం లేకుండానే క్రైస్తవులయ్యారు. ఐనా కొందరు యూద క్రైస్తవులు మాత్రం అన్యజాతివాళ్ళు కూడ ధర్మశాస్తాన్ని పాటించాలని వాదిస్తుండేవాళ్ళు

5. అంటియోకయ క్రైస్తవులు

అంటియోకయలో యూదులు మాత్రమేకాక అన్యజాతివాళ్లయిన గ్రీకులు కూడ క్రీస్తుని విశ్వసించారు – 11,19-21. ఈ యన్యజాతివాళ్ల సమస్యను పరిశీలించడానికి యెరూషలేము సమాజం బర్నబాను అంటియొకయకు పంపింది. అతడు ఆత్మ ప్రేరణం వల్లనే వీళ్ళ క్రైస్తవమతంలో చేరారని ధ్రువపరచాడు. ఇతడు తార్పు నుండి సౌలుని అంటియొకయకు తీసుకొని వచ్చాడు. ఈ యిద్దరూ ఆ నగరంలో ఒకయేడు వేదబోధ చేసారు. తర్వాత ఇద్దరూ ఇతర ప్రాంతాల్లోని అన్యజాతి వాళ్లకు బోధచేయడానికి అంటియొకయ నుండి పయనమైపోయారు - 13,1-3,

అంటియొకయ భక్తులనే మొట్టమొదటిసారిగా "క్రైస్తవులు" అని పిల్చారు - అ,చ. 11,26. అంతవరకు యూదులు అన్యజాతివాళ్ళ అనే రెండు వర్గాల ప్రజలున్నారు. ఇప్పడు క్రైస్తవులనే మూడవ వర్గం ప్రజ ఏర్పడింది. ఈ మూడవ వర్గంలో యూదులూ అన్యజాతివాళూ కూడ సభ్యులు. దీనివల్ల యూదులు మాత్రమేకాక అన్యజాతివాళ్ళకూడ తిరుసభలో చేరతారనే అంశం స్పష్టమైంది. కాని ఈ విషయం యెరూషలేములో కాక అంటియోకయలో విశదమైంది. అప్పటినుండి తిరుసభ అన్ని జాతులకు చెందింది, విశ్వవ్యాప్తమైంది అనే భావం ప్రచారంలోకి వచ్చింది.

6. పౌలు పాత్ర

తిరుసభ విశ్వవ్యాప్తమైంది అనే భావాన్ని బాగా ప్రచారంలోకి తెచ్చినవాడు పౌలు, యూదులు తన బోధను నిరాకరింపగా ఇతడు అన్యజాతులకు బోధ చేయడం మొదట పెట్టాడు - అ.చ.46-47. క్రీస్తుని గూర్చిన బోధ మొదట యెరూషలేములో ప్రారంభమైంది. తర్వాత యూదియా సమరయాల్లో జరిగింది. అటుతర్వాత భూదిగంతాల వరకు వ్యాపించింది - 1,8. ఈలా నేల నాల్లచెరుగుల వరకు క్రీస్తుని బోధించినవాడు పౌలే. నేడు మనం యూరప్ అని పిల్చే ప్రాంతంలో మొదట వేదబోధ చేసినవాడు ఇతడే.

యూదయా క్రైస్తవులు మొదట యూదులంతా క్రైస్తవ మతంలో చేరతారనీ, తమ జీవిత కాలంలోనే ప్రభువు రెండవసారి వేంచేసి వస్తాడనీ భావించారు. కాని ఈ రెండుకార్యాలు నెరవేరలేదు. కనుక పౌలు ఈ రెండు భావాలను గూర్చి లోతుగా ఆలోచించాడు. అతడు, క్రీస్తు తన జీవితకాలంలో రాడనీ, యూదులంతా క్రీస్తుని అంగీకరించరనీ గ్రహించాడు. యూదులూ అన్యజాతి ప్రజలూ కూడిందే తిరుసభ అని