పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8. ఆదిమ సమాజంలో తగాదాలు, సైఫను పాత్ర - అ.చ.6-7

అ,చ. 6వ అధ్యాయం ఆదిమ క్రైస్తవ సమాజంలోని తగాదాలను వర్ణిస్తుంది. యూదుల్లో పాలస్తీనా యూదులు, అన్యదేశాల్లో స్థిరపడిన యూదులు అవి రెండు తెగలవాళ్ళ ఉండేవాళ్ళ భోజన సమయంలో మొదటి తెగవాళ్లు బాగాతిని రెండవ తెగవాళ్ళకు తక్కువగా పెట్టారు. కనుక రెండవ తెగవాళ్లు జగడమాడారు. పేత్రు ఈ సమస్యను చక్కదిద్దడానికి ఏడురు పరిచారకులను నియమించాడు. అందరికి సరిసమానంగా భోజనం వడ్డించడం వీరిలో బాధ్యత. వీరిలో ప్రముఖుడు సైఫను. ఇతడు భోజన పరిచారకుడు మాత్రమే కాక గొప్ప వాక్యపరిచారకుడుకూడ.

సైఫను బోధవల్ల అతనికి శత్రువులు తయారయ్యారు. యెరూషలేము దేవాలయమూ ధర్మశాస్త్రమూ ప్రజలను రక్షించవనీ, క్రీస్తుమాత్రమే జనులను రక్షిస్తాడనీ, ఇతడు బోధించాడు. అందుచే యూదులు ఇతన్ని చంపజూచారు. ఇతడు యూదులకూ క్రీస్తు భక్తులకూ ఇక పొత్తుకుదరదని కూడ సూచించాడు. అంతవరకు శిష్యులుకూడ యూదవర్గంగానే చలామణి ఔతూవచ్చారు. ఇప్పడు క్రీస్తు భక్తులూ యూదులూ వేరువేరు వర్గాలనే భావం ఏర్పడింది.

యూదులు సైఫనుని రాళ్ళతోకొట్టి చంపారు. క్రీస్తు భక్తులను కూడ హింసించడం మొదలుపెట్టారు. అందుచే ఈ భక్తులు యెరూషలేమునుండి అన్య ప్రాంతాలకు వలసపోయారు. కాని వాళ్లు తాము పోయినకాడల్లా క్రీస్తుని గూర్చి బోధించడం మొదలుపెట్టారు. ఈ విధంగా క్రైస్తవమతం యూదయా సమరయాల్లో చాలా ప్రాంతాల్లో వ్యాప్తి చెందింది - 8,1-2.

4. అన్యజాతి ప్రజలుకూడ క్రైస్తవులు కావడం - అచ.10–11

వేదహింసవల్ల పారిపోయిన క్రైస్తవులు ఫినీష్యా సైప్రను అంటియోకయాల్లో వేదప్రచారం చేసారు. అంటియోకయాలో గ్రీకుప్రజలు కూడ క్రీస్తుని విశ్వసించారు. కనుక అన్యజాతివాళ్లు కూడ క్రైస్తవ మతంలో చేరే సమయం వచ్చింది. అంతవరకు క్రైస్తవులంతా యూదులు మాత్రమే. అన్యజాతులను తిరుసభలోకి రాబట్టడానికి ప్రభువు సౌలుని ప్రత్యేకంగా ఎన్నుకొన్నాడు. అతని కథ 9వ అధ్యాయంలో వుంది.

పదవ అధ్యాయం కొర్నేలి అనే రోమను సైన్యాధిపతి కుటుంబ సమేతంగా క్రైస్తవ మతంలో చేరిన ఉదంతాన్ని వర్ణిస్తుంది. మొదటిసారిగా క్రీస్తు శిష్యుడైన అన్యజాతివాడు ఇతడే. ఇతడు కైసరయ నివాసి. అంతవరకు క్రైస్తవులైన యూదులు మోషే ధర్మశాస్తాన్ని గూడపాటిస్తూ వచ్చారు. కానియిప్పడ అన్యజాతివాళ్ల ఈధర్మశాస్తాన్నిపాటింపవలసిన