బ్రెంటు మహాసభ బోధించినట్లు మనకు రెండు రకాల యాజకత్వముంది. మొదటిది క్రీస్తు యాజకునిలోనికి జ్ఞానస్నానం పొందినవాళ్ళంతా అతని యాజకత్వంలో పాలు పొందుతారు. ఇది సామాన్య యాజకత్వం. జ్ఞానస్నానం అనే సంస్కారం ద్వారా సిద్ధించేది. ఇదికాక గురువులు పొందే విశిష్ట యాజకత్వం కూడ వుంది. ఇది గురుపట్టం అనే సంస్కారం ద్వారా సిద్ధిస్తుంది. జ్ఞానస్నానపు యాజకత్వం వల్ల గృహస్థలు కూడ పూజబలినర్పిస్తారు. కాని వాళ్ళ అర్పణకీ గురువు అర్పణకీ తేడా వుంది. ఆ తేడా యిది.
నడిపూజలో అప్పరసాలను ఆశీర్వదించి వాటిని క్రీస్తు శరీరరక్తాలనుగా మారుస్తాం. ఈ కార్యం గృహస్టులు చేయరు. విశిష్ట యాజకత్వం గల గురువులు మాత్రమే చేస్తారు. ఇది గురువుల అర్పణం.
మరి గృహస్థలు సమర్పణం ఏమిటి? గురువు శ్రీసభ సభ్యులందరి తరపునా పూజనర్పిస్తాడు. గృహస్టులు కూడ అతనితో ఐక్యమై తండ్రికి పూజనర్పిస్తారు. ఇంకా వాళ్ళు తమ హృదయంలోని భక్తిభావాల ద్వారా కూడ పూజబలి నర్పిస్తారు. అనగా వాళ్ళ తమ హృదయంలోని స్తుతి ఆరాధన, కృతజ్ఞత, పశ్చాత్తాపం మొదలైన భక్తిభావాలను గురువు భక్తిభావాలతో ఐక్యం జేసి అతనితోపాటు తామూ పూజనర్పిస్తారు. వాళ్ళ జ్ఞానస్నానపు యాజకత్వమే ఈ సమర్పణకు పునాది. గృహస్టులు లేకపోయినా గురువు సమర్పణం చెల్లుతుంది. అతనితో ఐక్యమై, అతనితో పాటు అర్పించినపుడు మాత్రమే గృహస్తుల సమర్పణం చెల్లుతుంది.
4 స్థానిక శ్రీసభ ఆరాధనం
స్థానిక శ్రీసభ అంటే ఓ ప్రత్యేక మేత్రాసనమూ దాని పీఠాధిపతీ దానిలోని గురువులూ విశ్వాసులూనూ. పూజబలి శ్రీసభ కంతటికీ సంబంధించినది మాత్రమే కాదు. స్థానిక శ్రీసభకు సంబంధించింది కూడ. ఇటీవల ఈ స్థానిక శ్రీసభ పూజబలి ప్రాముఖ్యం బాగా ప్రచారంలోకి వచ్చింది. ఈ స్థానిక శ్రీసభలో పీఠాధిపతి ప్రధానమైన ఆరాధనా నిర్వహణుడు. అనగా అతడు స్థానికంగా ప్రధానయాజకుడు. స్థానిక పీఠంలోని విశ్వాసుల ఆధ్యాత్మిక జీవితం ఒక విధంగా అతనిమీద ఆధారపడి వుంటుంది. ఈ పీఠాధిపతి తన గురువులతో కలపి పూజబలి సమర్పించడం ద్వారా, స్థానిక విశ్వాసులు ఆ කච්ඒ" పాల్గొనడం ద్వారా, స్థానిక శ్రీసభ వృద్ధిలోకి వస్తుంది. మేత్రాసనంలోని విచారణలన్నీ మేత్రాసన కేంద్రంతో ముడిపడి వుంటాయి. కనుక ఆయా విచారణల్లో గురువులర్పించే పూజలు పీఠాధిపతి తన గురువులందరితో కలసి చేసే సంయుక్త పూజతో సంబంధం కలిగి వుంటాయి. ఒక్కోమేత్రాసనంలోని పలువిచారణల్లో వసించే క్రైస్తవులు అవకాశం