పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రార్థనా భావాలు

1. గ్రెగోరీ నాసియాన్సన్ భక్తుడు ఈలా వ్రాసాడు. "దేవుడు తనలోని ముగ్గురు వ్యక్తులనుగూర్చి మూడుదశల్లో నరులకు తెలియజేసికొన్నాడు. పూర్వవేదం తండ్రినిగూర్చి స్పష్టంగాను క్రీస్తునిగూర్చి అస్పష్టంగాను మాట్లాడుతుంది. నూత్నవేదం క్రీస్తుని స్పష్టంగా బోధిస్తుంది. కాని ఆత్మ దైవత్వాన్ని అస్పష్టంగా మాత్రమే బోధిస్తుంది. పెంతెకోస్తు తర్వాత ఇప్పడు ఆత్మ మన హృదయాల్లో వసిస్తూ తన్నుతాను మనకు స్పష్టంగా తెలియజేసి కొంటూంది. నరులకు తండ్రిని గూర్చి తెలియకముందే కుమారుని తెలియజేయడం, కుమారుని గూర్చి తెలియకముందే ఆత్మను తెలియజేయడం భావ్యం కాదు, అప్పడు మనం ముగ్గురు దైవవ్యక్తులకూ వుండే వ్యత్యాసాన్ని గుర్తించలేక ఒకరితో ఒకరిని కలపివేసి వుండేవాళ్ళమే. పిల్లలకు అరగించుకోలేనంత భోజనం పెట్టకూడదు. వారి కండ్ల చూడలేని సూర్యుణ్ణి వారికి చూపించకూడదు. కనుక దేవుడు తన్నుగూర్చి తాను ఒక విడతగాక, క్రమేణ మెట్లమెట్లుగా తెలియజేసికొన్నాడు". ఇవి లోతైన వాక్యాలు. పలుసార్లు భక్తితో మననం చేసికోదగ్గవి.

2. ఇరెనేయస్ భక్తుడు ఈలా చెప్పాడు. "ఉత్తాన క్రీస్తు శిష్యులకు తన యాత్మను దయచేసాడు. శిష్యులు ఆ యాత్మను పొంది ప్రజలకు జ్ఞానస్నానమిచ్చారు. వారికి ఆ యాత్మను పంచిపెట్టారు. ఈ విధంగా వాళ్ళ శ్రీభను స్థాపించారు. కనుక క్రీస్తూ ఆత్మా శిష్యులు స్థాపించిన శ్రీసభలో నెలకొని వుంటారు." ఈనాడు మనం శ్రీసభ ద్వారాగాని ఆత్మను పొందలేం.

11. ఆత్మతో నిండిన క్రీస్తు

1. పౌలు చెప్పినట్లుగా క్రీస్తు ప్రాణప్రదాతయైనన ఆత్మ అయ్యాడు - 1కొ 15,45, అనగా ఉత్థాన క్రిస్తు పరిశుద్ధత, శక్తి అణిమ, మహిమ మొదలైన ఆత్మలక్షణాలను పొందాడని భావం. క్రీస్తు ఉత్తానం అతని జీవితంలో శిఖరాయమానమైంది. ఆ సంఘటనం తర్వాత అతనికి నూత్నమహిమ ఏదీ లేదు. ఉత్తానంద్వారానే అతడు కుమారుడయ్యాడు. ఈ కుమారుణ్ణి గూర్చి రెండవ కీర్తనం నీవు నాకు కుమారుడవు ఈ దినం నీవు నాకు జన్మించావు అని చెప్తుంది - 2,7. ఉత్తానం ద్వారా సిద్ధించిన ఈ కుమారత్వానికి పరిశుద్దాత్మడే కారకుడు. క్రీస్తు జననం ద్వారానే కుమారుడు. కాని మరణోత్తానాల ద్వారా అతడు తండ్రికి అధిక ప్రీతిపాత్రుడైన కుమారుడయ్యాడు.