ఆత్మడు మనలోనే వుంటాడు - యోహా 14, 17. మనం నిర్ణయాలు చేసికొనేపుడూ, పనికి పూనుకొనేపడూ మన అంతరంగంలో వుండి మనకు ప్రేరణ పట్టిస్తాడు.
ప్రార్థనా భావాలు
1. ఇరెనేయస్ భక్తుడు ఈలా చెప్పాడు. "క్రీస్తులో వసిస్తూన్నపుడే ఆత్మడు నరజాతితో జీవించడానికి అలవాటు పట్టాడు. అటుపిమ్మట ఆ దివ్యమూర్తి అపోస్తలుల్లో వసించాడు. నేడు మనలోను వసిస్తున్నాడు". పవిత్రాత్మకు మానవజాతి అంటే యిష్టం. మానవులతో వుండడం యిష్టం. మన తరపున మనకుకూడ ఆ యాత్మపట్ల ఎనలేని ప్రీతి పుట్టాలి.
2. అగస్టీను భక్తుడు తన విశ్వాసులకు ఈలా బోధించాడు. "నా మట్టుకు నేను మీకు వేదవాక్యం విన్పించాను. కాని మీరు నా పల్ములను విన్నపుడు ఆత్మే మీ హృదయాల్లో బోధచేస్తుంది. లేకపోతే నేను విన్పించిన వేదవాక్యం మీకు అర్థం కానేకాదు. బోధకుల బోధ మనం కేవలం చెవులతో వినడానికి మాత్రమే. మన హృదయాల్లో నిజంగా బోధచేసే దేవుని ఆత్మ పరలోకంలో వుంది. మీలో వసించే క్రీస్తు ఆత్మ మీ హృదయాల్లో మాట్లాడకపోతే నా బోధ నిరర్ధకమే ఔతుంది." బోధకుల బోధలను నిమిత్త మాత్రంగా తీసికొని ఆత్మే నేడు మనకు బోధ చేయాలని వేడుకొందాం.
9. కడపటి దినాల్లో దేవుడిచ్చే దానం
1. ప్రభువు మోషే అనుచరులైన 70 మంది పెద్దలకూ ఆత్మను దయచేసాడు. అతడు మోషే ఆత్మను తీసికొని ఆ పెద్దలకిచ్చాడు - సంఖ్యా 11,25, అటుపిమ్మట న్యాయాధిపతులూ రాజులూ ప్రవక్తలూ ఆత్మను పొందారు. అంత్యదినాల్లో ఆత్మ అందరి మీదికీ దిగివస్తుందని యోవేలు ప్రవచించాడు -2.28. కాని చివరి ప్రవక్తయైన మలాకీతో పూర్వవేదంలో ఆత్మ అదృశ్యమైపోయింది. యేసు ఇంకా మహిమను పొందలేదు కనుక ఆత్మ అనుగ్రహింపబడలేదు అంటుంది యోహాను సువిశేషం 7,39. అనగా ప్రవక్తల కాలం ముగిశాక అదృశ్యమైన ఆత్మ మళ్ళా క్రీస్తు మహిమానంతరంగాని మనకు దర్శనమీయదు. అందుకే కాబోలు ఎఫేసులోని స్నాపక యోహాను శిష్యులు "పవిత్రాత్మడు ఉన్నాడన్న విషయం మేము విననైన లేదే? అన్నారు - అ, చ,19,2.
2. క్రీస్తుతో ఆత్మ మళ్ళా ప్రత్యక్షమైంది. క్రీస్తు జ్ఞానస్నాన సమయంలో పావురంలా దిగివచ్చింది - లూకా 3,22, ఉత్తాన క్రీస్తు తండ్రినిచేరి పిత వాగ్దానమైన ఆత్మను స్వీకరించాడు. ఆ యాత్మను మన మీద కూడ కుమ్మరించాడు - అ,చ. 2,33. నేడు 17