3. ప్రాణం పవిత్రమైంది
క్షణభంగురమైనదైనా కూడా నరుని ప్రాణం పవిత్రమైంది. ప్రతి జీవి జీవంకూడ పవిత్రమైందే, నరుని ప్రాణం ఇంకా యొక్కువ పవిత్రమైంది. ఎందుకంటే అతని ప్రాణం దేవుని శ్వాసే. దేవుడు నరుని ముక్కుగోళ్ళలోనికి ప్రాణవాయువును ఊదితే అతడు సజీవి అయ్యాడు - అది 2,7.
“అతడు ప్రాణుల కొసగిన ఊపిరి తీసికొంటే,
తానిచ్చిన ప్రాణాన్ని తాను మరల చేకొంటే,
జీవులన్నీ నశిస్తాయి
నరుడు మట్టిలో కలసిపోతాడు
-యోబు 34,14-15. దేవుని ఊపిరి కలవాడు కనుక నరుణ్ణి హత్యచేయకూడదు -నిర్గ 20,13. ప్రభువు కయీనులాంటి దుర్మార్ణుణ్ణి కూడ అప్పటికప్పుడే చంపలేదు. ప్రాణంమీద అతనికుండే గౌరవం ఆలాంటిది - ఆది 15,4.
జీవులకు దేవుడిచ్చిన ప్రాణం వాటి రక్తంలో వుంటుంది. కనుక నరుడు జంతువును తినవచ్చునుగాని దాని రక్తాన్ని ఆరగించకూడదు. ఈ రకాన్ని బలిపీఠంమీద చిలికించి పాపాలకు ప్రాయశ్చిత్తం చేయవచ్చు. కాని దాన్ని భుజించకూడదు - లేవీ 17, 11-12.
3. దేవుడు జీవాన్నిస్తానని వాగ్దానం చేసాడు
1) జీవమూ కట్టడలూ
ఎవని మరణం వలనా దేవునికి సంతోషం కలుగదు, నరులు తమ పాపాలనుండి వైదొలగి మళ్ళా బ్రతకాలనే అతని కోరిక - యెహెజ్కేలు 18,32. దేవుడు నరుణ్ణి చావడానికిగాదు బ్రతకడానికే చేసాడు.
"దేవుడు నరుజ్జీ అమరుజ్జీగా జేసాడు"
—సాలో 223. నరునికి శాశ్వత జీవమీయడానికి ఏదెను తోటలో జీవమిచ్చే పండ్ల చెట్టునుగూడ నాటాడు. కాని నరుడు దేవుని છઠ્ઠું మీరాక అతనికి ఆ చెట్టదగ్గరికి వెళ్ళే హక్కుపోయింది - ఆది 2,22-23. ఆ పాపదశలో గూడ నరుడు దేవుని ప్రాణాన్ని తీసివేయలేదు. అతని అమరత్వాన్ని మాత్రం తొలగించాడు. అతన్ని నిత్యుని నుండి అనిత్యుణ్ణిగా మార్చాడు. ఐతే జీవానికి చేరే మార్గాన్ని మాత్రం అతనికి చూపించాడు - కీర్త 16,11. ఈ మార్గం ధర్మశాస్త్ర మార్గమే. మోషే కట్టడలను అనుసరిస్తే చాలు నరునికి జీవం కలుగుతుంది. కనుకనే ప్రభువు "మీరు నా యాజ్ఞలను అనుసరిస్తే చాలు జీవాన్ని పొందుతారు" అని చెప్పాడు - లేవీ 18,5. ఆజ్ఞలను పాటించేవాళ్ళకు ధన్యతలు సిద్ధిస్తాయి. వాళ్ళ పర్ణాయుష్ములౌతారు - నిర్గ 23,26. ఇంకా, బరూకు గ్రంథం ఈలా చెప్పంది