పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేసికొన్నాడు - గల 1,4. మనం పాపాత్ములమై యుండగా క్రీస్తు మన కొరకు మరణించాడు - రోమా 5,7. ఈలాంటి వేదవాక్యాలనుబట్టి ఆ తండ్రీ కుమారులకు మన పట్ల ఎంత గాఢమైన ప్రేమ వుందో అర్థంచేసికోవాలి.

5. క్రైస్తవులమైన మనం ప్రధానంగా క్రీస్తునుండి రక్షణం పొందినవాళ్ళం. అతడు సమస్త దుర్నీతి నుండి మనలను విముక్తులను చేసాడు - తీతు 2,14. ఈ మహాభాగ్యానికి మనమెంతో సంతోషించాలి. చాలమంది ఈ లోకభాగ్యాలను చూచుకొని సంతోషిస్తారు. కాని పరలోక భాగ్యాలను చూచుకొని సంతోషించడం నిజమైన ఆనందం.

6. ఎంతచెట్టుకి అంత గాలి. ప్రభువు రక్షణాన్ని పొందిన మనం వొళ్ళ దగ్గరపెట్టుకొని జీవించాలి. పవిత్రంగా మనుగడ సాగించాలి. మన దేవుడు పవిత్రుడు. అతన్ని కొలిచే ప్రజలమైన మనంకూడ పవిత్రంగా జీవించాలి — లేవీ 20,26. ఎవడైన క్రీస్తులోవుంటే అతడు నూత్నసృష్టి ఔతాడు. అతనికి ప్రాతజీవితం గతించి క్రొత్తజీవితం ప్రారంభం కావాలి - 2 కొరి 5, 17.

2. మధ్యవర్తి

రెండు పక్షాలకు సంధిచేసేవాడు మధ్యవర్తి ఆదాము పాపంద్వారా నరజాతి దేవునికి శత్రువైంది. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుద్వారా ఈ నరజాతితో మళ్ళా సఖ్యత ఏర్పరచుకొన్నాడు. క్రీస్తు దేవునికీ నరులకూ మధ్య ప్రధాన మధ్యవర్తి మొదట పూర్వవేద మధ్యవర్తులను పరిశీలిద్దాం.

1. పూర్వవేద మధ్యవర్తులు

చారిత్రక మధ్యవర్తులు

అబ్రాహాము దేవునికి ఆదిమ నరజాతికీ మధ్య మధ్యవర్తి, అతనిద్వారా సమస్త జాతిజనులూ దీవెనలు పొందుతారు - ఆది 12,3, అతని ద్వారానేయిస్రాయేలు ప్రజలు భూమినీ సంతానాన్ని పొందుతారు. ఇతడు అబీమెలెకు కొరకు దేవుని ప్రార్థించాడు. ఆ ప్రార్థనను ఆలించి దేవుడు అబీమెలెకును శిక్షింపకుండా వదలివేసాడు - ఆది 20,17. ఇంకా యితడు సౌదొమగొమొర్రాలకొరకు గూడ ప్రార్థించాడు -అది 18, 22-32.

మోషే దేవునికీ యిప్రాయేలీయులకూ నడుమ మధ్యవర్తి, ప్రభువు అతనిద్వారా యిస్రాయేలీయులతో నిబంధనం చేసికొన్నాడు. వారికి ధర్మశాస్తాన్ని ప్రసాదించాడు.