పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6. కయీను హేబెలును చంపాడు - ఆది 4,8

ఆదాము పాపంవలని దుష్ఫలితాలను ఆదికాండం సమగ్రంగా వర్ణిస్తుంది. ఆదాము ఏవను చూచి "ఈమె నా యెముకల్లో యెముక. దేహంలో దేహం" అనుకున్నాడు -2, 23. తనకు దగ్గరి బంధువురాలు, లేక తన ప్రేమకు పాత్రురాలు అని ఈ మాటల భావం. ఈలాంటి ఏవనే అతడు పాపంచేసాక నిందించడం మొదలెట్టాడు. "నాయంతట నేను ఈ పండు తినేవాణ్ణికాదు, ఆమే నా చేత తినిపించింది" అన్నాడు - 8, 12 ఆదామేవ లిద్దరూ దేవుని దృష్టిలో సరిసమానులే. ఇద్దరూ మానవులే. ఇద్దరూ దేవుని బిడ్డలే. ఇద్దరూ దేవుని చేరవలసినవాళ్ళే ఐనా పాపం చేసాక స్త్రీ పురుషునికి బానసగా మారిపోయింది. అతడు ఆమె మీద అధికారం చెలాయించడం మొదలెట్టాడు - 3,16. పాప ఫలితం ఈలా వుంటుంది. ఇక, నరులందరూ దేవుని పోలికగా సృజింపబడినవాళ్ళే ఐనా నరుడు తోడి నరుణ్ణి దేవ్వషించడం మొదలెట్టాడు. కయీను తమ్ముడైన హేబెలుమీదపడి అతన్ని సంహరించాడు- 4,8. ఈ ద్వేషభావం మనకూ అనుభవపూర్వకంగా తెలిసిందే!

7. దేవుడు వారి భాషను తారుమారు చేసాడు - ఆది 11,9.

లేమెకు తన్నుకొట్టవచ్చిన వానిని పట్టుకొని క్రౌర్యంతో చంపివేసాడు. కయీనును చంపినవానికి ఏడంతలు శిక్త్రెతే నన్ను చంపబోయినవానికి డెబ్బదియేడంతలుగా శిక్ష విధిస్తానన్నాడు - 4, 23. ఈ లేమెకు క్రూరవాక్యాలను మనసులో పెట్టుకొనే ప్రభువు తర్వాత, శత్రువులను డెబ్బదియేడుసార్లవరకూ క్షమించాలని బోధించాడు - మత్త 18,22

పాపఫలితంగా నరుని ఆయుఃప్రమాణంకూడ తగ్గి పోయింది. అతడు నూట యిరువదేండ్లు మాత్రమే బ్రతకగలిగే దుర్బలప్రాణి అయ్యాడు - 6,3. నోవా కాలంలో ఆ పుణ్యపురుషుని కుటుంబంతప్ప మిగిలిన ప్రాణికోటి అంతా నశించిపోయింది - 6,18, ఈ నోవా కట్టిన ఓడ భగవంతుడనుగ్రహింపబోయే రక్షణానికి సంకేతంగా వుంటుంది.

అటుతరువాత నరులు బాబెలు గోపురం కట్టబోయారు. ఆకాశాన్నంటే గోపురాన్నికట్టి పేరు సంపాదించుకుందామనుకున్నారు – 114. కాని దేవుడు వాళ్ళ అహంకారానికి క్రుద్దుడై నేలమీదకు దిగివచ్చాడు. వాళ్ళ భాషను తారుమారు చేసాడు. నరులను నేల నాలుగు చెరగులకు చెదరగొట్టాడు -11,8, ఇవి ఆదాము పాపం తెచ్చిపెట్టిన దుష్ఫలితాలు. మన పాపాలవల్ల కూడ ఈలాంటి దుష్ఫలితాలే సిద్ధిస్తాయి!

8. జంతువులన్నిటిలోను పాము జిత్తులమారిది - 3,1.

తొలి తల్లిదండ్రులు పాపం చేసారు. కాని ఈ పాపం వాళ్ళనుండి బయలుదేరలేదు. మూడవ వ్యక్తియైన పిశాచం నుండి బయల్వెడలింది. ఈ పిశాచం ఓ దేవుడూకాదు, దేవుని ప్రతిఘటించి నిలచే ఓ ద్వితీయశక్తికాదు, అది భగవంతుడు సృజించిన ప్రాణుల్లో వొకటి. ఆదికాండం ఈ ప్రాణిని "పాము" అని పిలుస్తుంది. ఈపాము యావే సృజించిన