పుట:Bhoojaraajiiyamu.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

178

భోజరాజీయము ఆశ్వా 6


నబ్జవదనమీఁద యభిలాష విడిచి నీ
కిష్టమైనయెడకు నేఁగు మంటి.'

18


వ.

అవిన నతం డుదరి యాకసంబు దాఁకి యేమీ కొంకక
యింకను నిట్ల
పల్కుమా! నాచేతికొలఁది చూతుఁ గాని, యని భుజాస్ఫాలనంబు సేయుచు
నిలిచి యదల్చె; నేనును నాధౌతోత్తరీయంబు నడుమునం జుట్టుకొని నెట్టుకొని
యుండితి; నప్పు డీ తనుమధ్య మధ్యస్థయై మమ్ము వారించి, నామనోనేత్రంబు
లకు మీ రిరువురు నొక్కవిధంబు కాని భేదంబు లేదు, వాదంబు దక్కి మన
పురంబునకు నన్నుం దోఁకొని పోయి నలుగురు చెప్పినట్లు పొం డని
పల్కెనంత.

19


క.

ఇట్టిద యగు కార్యం బని
గట్టిగ నింతిఁ గొని పోయి కతిపయతిథులం
బట్టణము సొరఁగఁ గోమటి
సెట్టియు నీరెడ్డి కొడుకుఁ జెఱి యొకవలనన్.

20


చ.

కనుఁగొని హర్ష చిత్రపులకంబులు మేనుల నివ్వటిల్ల నీ
వనితకునై కదా ధనము వంచన సేయక పాఱఁ జల్లితిం,
బలివడి బేగ కట్టియలు బండ్లకుఁ బూన్చితి నంచుఁ దారు చే
పినపను లుగడించుచును శీఘ్రగతిం గదియంగ వచ్చినన్.

21


ఉ.

'చేరకుఁ డింతి నెవ్వఁ డిటు చేరినఁ బ్రాణముమీఁద వచ్చు నం
భోరుహసంభవాన్వయుఁడు పూజ్యుఁడు గాన సహించి యుంటిఁ గా
కొరయ నన్యు లెంతటి బలాధికు లైనఁ దృణీకరింపనే
మీర లెఱుంగ రిట్లు పులిమీసల నుయ్యల లూఁగ వచ్చునే.'

22


క.

అని యా రాజకుమారుడు
కినిసి పలికె; నపుడు వారికిని మాకును నీ
వనితకు వాదము ముదిరినఁ
జని చెప్పితి మప్పురంబు సభవారలకున్.

23


వ.

చెప్పిన విని యాసభాసదు లందఱు నొండొరుల మొగంబులు చూచి యీముడి
మాచేతం దీరదు, తత్పురంబుసమీపంబున నొక్క రాజర్షి యున్నవాఁ డతని