పుట:Bhoojaraajiiyamu.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

172

భోజరాజీయము ఆశ్వా 6


శ్రీ విభవము పలుమఱు శో
కావేశమతిం దలంచు నశ్రులు నించున్.

234


క.

నాయనుఁగుఁదనయుఁ డింతకు
నేయెడ కరుగు ననుఁ, దొల్లి యెఱుఁగండు ప్రవా
సాయాసం బను, నేనునుఁ
బోయెదఁ గా కనును, గడచి పోకున్నె యనున్.

235


క.

ఇవ్విధమునఁ దలపోయుచు
నివ్వటిలెడు పుత్రశోక నిష్ఠురవహ్నిన్
గ్రొవ్వు చెడ నెరసి జీవం
బవ్విభుఁడు దొఱంగె స్వజను లాక్రందింపన్.

236


క.

సితదత్తుఁ డవ్విధంబున
మృతుఁ డగుటయు మంత్రివరులు భృత్యులును బురో
హితసామంతాదులు స
మ్మతి నాలోచించి యైకమత్యం బెసఁగన్.

237


ఉ.

ఆతనిపాలి కేఁగి 'సుగుణాకర! నీజనకుండు నిర్జర
వ్రాతములోని కేఁగె మనరాజ్యము కెవ్వరు దిక్కు లేరు నీ
వీతఱిఁ దీర్థసేవ కిటు లేఁగుట నీతిపథంబె వైరిధా
త్రీ లనాథు లిం కిట మదింపరె శిక్ష యొనర్పకుండినన్.'

238


క.

అనిన విని 'యకట నాకై
తన ప్రాణము విడిచెఁ దండ్రి, తత్పురి కే నే
మని వత్తు గంగ కరిగెద
నని వెల్వడి వచ్చి మగుడ నర్హంబగునే!

239


క.

ఎక్కడి పితృమరణము మఱి
యెక్కడి రాజ్యంబు గంగ కేఁగెడుచో మీ
రిక్కడి విఘ్నము చేసెద
రెక్కడి బ్రాహ్మణులు మరలుఁ డే రా నొల్లన్.'

240


వ.

అని విడియ నాడిన నతని యాగ్రహంబునకు నిగ్రహపడక సామోపాయంబునఁ
గార్యంబు గొనవలయు నని వార లి ట్లనిరి.

241