పుట:Bhoojaraajiiyamu.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వంజరుని కధ

171


నుండెఁ గాక తనకు రెండుకన్నులు గల్గి
యుండి యందునట్ల యుండఁ దగునె?

229


క.

నీ వెఱుఁగని ధర్మస్థితి
భూవర! మఱి కలదె, నన్నుఁ బుచ్చుము, త్రిజగ
త్పావని యగుగంగానది
కేవిఘ్నముఁ జేయవలవ దిచ్చో' ననినన్.

230


క.

'అన్నన్న యేల నీ కీ
పిన్నొడలికి నలవిగాని పెనుఁబోకలు? నే
నున్నంతకాలమును నా
కన్ను లెదుర నుండవన్న కథ లేమిటికిన్?'

231


క.

అని తన్ను నివారించిన
జనకునితో నతఁడు 'నన్నుఁ జననీ కున్నం
జనవర! నీమీఁద నభో
జన ముండుదు' ననుచు గెంటసము లాడుటయున్.

232


సీ.

ఏఁ దన్ను వల దని యెన్ని చెప్పిన మానఁ
       డని పంప నేఁడాది కాఱునెలల
కైనను గ్రమ్మఱ నరుదెంచు బలిమి నేఁ
       డడ్డ పెట్టితి నేని నశన ముడిగి
వేగంబె ప్రాణము ల్విడుచు నీరెంటియం
       దును వీనిఁ గాశికిఁ బనుచుపనియె
పొసఁగి యున్నది యని వసువస్త్రధాన్యాది
       కముగఁ బాధేయంబు గలుగ నొసఁగి


ఆ.

పరిజనముల నుచితభంగిఁ దో డిడి కొంద
ఱవనిసురులఁ గూర్చి యవ్విభుండు
తనకుఁ బ్రణతుఁ డైన తనయుని నాశీర్వ
దించి వీడుకొలిపెఁ దెగువతోడ.

233


క.

ఈ విధమునఁ దనుఁ బాసియు
భావంబునఁ బాయకున్న బాలునిరూప